AP Govt: వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- కాలనీల దగ్గర తగ్గుతున్న వరద.. నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజులు పట్టే ఛాన్స్..
- నిత్యావసరాలు.. మంచినీరు కోసం రోడ్లపైకి వస్తున్న స్థానికులు..
- నాలుగు రోజులుగా కరెంట్ కూడా లేకపోవడంతో బాధితుల అవస్థలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా నగరంలో జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. బుడమేరుకి కవులూరు దగ్గర పడిన మూడు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావటంలో ట్రాక్టర్లు కీలంగా మారాయి.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
అలాగే, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్త, రోడ్లు శుద్ధి చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పని చేసే శానిటేషన్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ స్టేడియంకు వచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాలువలు, రోడ్లు, భవనాలు శుద్ధి చేయడానికి కావలసిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మున్సిపల్ కార్మికులు చేరుకున్నారు.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు అందజేసేందు కోసం అధికారులు పాలు, బిస్కెట్లు, వాటర్ సిద్ధం చేశారు. ఆహార పంపిణీలో లూటీలు జరగకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆహార పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక వాహనాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు, బిస్కెట్, వాటర్ ప్యాకెట్ వాహనాలు చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!