AP Govt: వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- కాలనీల దగ్గర తగ్గుతున్న వరద.. నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజులు పట్టే ఛాన్స్..
- నిత్యావసరాలు.. మంచినీరు కోసం రోడ్లపైకి వస్తున్న స్థానికులు..
- నాలుగు రోజులుగా కరెంట్ కూడా లేకపోవడంతో బాధితుల అవస్థలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా నగరంలో జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. బుడమేరుకి కవులూరు దగ్గర పడిన మూడు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావటంలో ట్రాక్టర్లు కీలంగా మారాయి.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
అలాగే, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్త, రోడ్లు శుద్ధి చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పని చేసే శానిటేషన్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ స్టేడియంకు వచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాలువలు, రోడ్లు, భవనాలు శుద్ధి చేయడానికి కావలసిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మున్సిపల్ కార్మికులు చేరుకున్నారు.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు అందజేసేందు కోసం అధికారులు పాలు, బిస్కెట్లు, వాటర్ సిద్ధం చేశారు. ఆహార పంపిణీలో లూటీలు జరగకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆహార పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక వాహనాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు, బిస్కెట్, వాటర్ ప్యాకెట్ వాహనాలు చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!