AP Govt: వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- కాలనీల దగ్గర తగ్గుతున్న వరద.. నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజులు పట్టే ఛాన్స్..
- నిత్యావసరాలు.. మంచినీరు కోసం రోడ్లపైకి వస్తున్న స్థానికులు..
- నాలుగు రోజులుగా కరెంట్ కూడా లేకపోవడంతో బాధితుల అవస్థలు..
AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా నగరంలో జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. బుడమేరుకి కవులూరు దగ్గర పడిన మూడు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావటంలో ట్రాక్టర్లు కీలంగా మారాయి.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అలాగే, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్త, రోడ్లు శుద్ధి చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పని చేసే శానిటేషన్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ స్టేడియంకు వచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాలువలు, రోడ్లు, భవనాలు శుద్ధి చేయడానికి కావలసిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మున్సిపల్ కార్మికులు చేరుకున్నారు.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు అందజేసేందు కోసం అధికారులు పాలు, బిస్కెట్లు, వాటర్ సిద్ధం చేశారు. ఆహార పంపిణీలో లూటీలు జరగకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆహార పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక వాహనాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు, బిస్కెట్, వాటర్ ప్యాకెట్ వాహనాలు చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!