AP Govt: వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- వరద విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ..
- కాలనీల దగ్గర తగ్గుతున్న వరద.. నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజులు పట్టే ఛాన్స్..
- నిత్యావసరాలు.. మంచినీరు కోసం రోడ్లపైకి వస్తున్న స్థానికులు..
- నాలుగు రోజులుగా కరెంట్ కూడా లేకపోవడంతో బాధితుల అవస్థలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా నగరంలో జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. బుడమేరుకి కవులూరు దగ్గర పడిన మూడు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు రావటంలో ట్రాక్టర్లు కీలంగా మారాయి.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
అలాగే, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్త, రోడ్లు శుద్ధి చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో పని చేసే శానిటేషన్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే విజయవాడ మున్సిపల్ స్టేడియంకు వచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. కాలువలు, రోడ్లు, భవనాలు శుద్ధి చేయడానికి కావలసిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మున్సిపల్ కార్మికులు చేరుకున్నారు.
Read Also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..
అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు అందజేసేందు కోసం అధికారులు పాలు, బిస్కెట్లు, వాటర్ సిద్ధం చేశారు. ఆహార పంపిణీలో లూటీలు జరగకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆహార పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక వాహనాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు, బిస్కెట్, వాటర్ ప్యాకెట్ వాహనాలు చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు ఆహార పదార్థాలు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!