Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన కూడళ్లలోని ప్రభుత్వ భవనాల గోడల మీద, ఫైఓవర్ల పైన వేసిన స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పాత బస్టాండ్ కాంపౌండ్ వాల్స్ను పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు గొప్పగా తీర్చిదిద్దారు.
భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు నాటి యోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, అలుపెరగకుండా సాగించిన ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా స్టూడెంట్స్ చిత్రాలు గీశారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఈ పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. ఈ అరుదైన కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఒకరికి మించి మరొకరు తమ క్రియేటివిటీని, స్కిల్స్ను సెంట్పర్సెంట్ ప్రదర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్ర వంటి చారిత్రక ఘట్టాలను అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
Jana gana mana-telangana: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో ‘జన గణ మన’ ఒక నిత్య ఆలాపన
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్లను చూడచక్కగా, ఆకర్షించేలా రాశారు. మన్యం వీరుడు అల్లారి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇలా పలువురు ఫ్రీడం ఫైటర్స్ను సచిత్రంగా సిటీలో కొలువుదీర్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద వేసిన పెయింటింగ్స్ అటు వైపు వెళ్లేవాళ్లను చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తికాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వీఎంసీ ఈ పోటీలను ఏర్పాటుచేసింది. విజేతలకు ఇండిపెండెన్స్ రోజున బహుమతులను అందించనుంది.
స్వాతంత్ర్యోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీఎంసీ చేసిన కృషిని స్థానికులు మెచ్చుకుంటున్నారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్ని భాగస్వాములను చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఈసారి ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విజయవాడవాసులతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజానీకంలో జాతీయ భావం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!