Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన కూడళ్లలోని ప్రభుత్వ భవనాల గోడల మీద, ఫైఓవర్ల పైన వేసిన స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పాత బస్టాండ్ కాంపౌండ్ వాల్స్ను పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు గొప్పగా తీర్చిదిద్దారు.
భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు నాటి యోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, అలుపెరగకుండా సాగించిన ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా స్టూడెంట్స్ చిత్రాలు గీశారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఈ పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. ఈ అరుదైన కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఒకరికి మించి మరొకరు తమ క్రియేటివిటీని, స్కిల్స్ను సెంట్పర్సెంట్ ప్రదర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్ర వంటి చారిత్రక ఘట్టాలను అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించారు.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
Jana gana mana-telangana: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో ‘జన గణ మన’ ఒక నిత్య ఆలాపన
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్లను చూడచక్కగా, ఆకర్షించేలా రాశారు. మన్యం వీరుడు అల్లారి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇలా పలువురు ఫ్రీడం ఫైటర్స్ను సచిత్రంగా సిటీలో కొలువుదీర్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద వేసిన పెయింటింగ్స్ అటు వైపు వెళ్లేవాళ్లను చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తికాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వీఎంసీ ఈ పోటీలను ఏర్పాటుచేసింది. విజేతలకు ఇండిపెండెన్స్ రోజున బహుమతులను అందించనుంది.
స్వాతంత్ర్యోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీఎంసీ చేసిన కృషిని స్థానికులు మెచ్చుకుంటున్నారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్ని భాగస్వాములను చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఈసారి ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విజయవాడవాసులతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజానీకంలో జాతీయ భావం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..