Loan Apps: లోన్ యాప్స్ యమా డేంజర్.. వాటి జోలికి పోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కాల్ మనీ.. ఇప్పుడు లోన్ యాప్స్ (Loan Apps) కలవరం కలిగిస్తున్నాయి. లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్టీవీతో విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా (Kranthi Rana Tata) మాట్లాడారు. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరం…ప్రజలు ఎవ్వరూ లోన్ యాప్స్ లో మనీ తీసుకోవదన్నారు.
లోన్ అప్లయ్ చేసే క్రమంలోనే పూర్తి వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తున్నారు. మన ఫోన్ కాంటాక్స్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో వారు మన బంధువులకు కాల్ చేసి వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో మన అకౌంట్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వవద్దు. అందులో మహిళలు, చిన్నపిల్లల ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీలంగా తయారు చేసి పంపుతున్నారు. కాల్ సెంటర్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.ఈ లోన్ యాప్ లకు ఆర్బీఐ, ప్రభుత్వం అనుమతులు లేవు. ఇలాంటి వాటికి పబ్లిక్ దూరంగా ఉండాలన్నారు. రికవరీ ఏజెంట్స్ పై కూడా దృష్టి పెట్టాం అనీ, నందిగామ కేసులో రికవరీ కంపెనీలను, ఏజెంట్లను అరెస్టు చేసాం అని వివరించారు సీపీ క్రాంతిరాణా టాటా.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇటీవల లోన్ యాప్స్ ఆగడాల వల్ల విద్యార్ధినులు, చిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వయానా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani govardhan reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anilkumar Yadav) లను కాల్ సెంటర్ ఏజెంట్లు వేధించిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఆ రికవరీ ఏజెంట్ల భరతం పట్టారు పోలీసులు. ఇంటికి వచ్చి మరీ వేధించడం ఎక్కువైంది. తమ ఫోన్ కాంటాక్ట్స్ లోని వ్యక్తులకు, మహిళలకు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమయిన, అభ్యంతకరమయిన మెసేజ్ లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం మరీ ఎక్కువైంది. దీంతో వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నారు. లోన్ యాప్స్ ద్వారా 10 వేలు రుణం తీసుకుంటే.. దానికి రెండుమూడురెట్లు రికవరీ చేస్తున్నారు. వడ్డీ ఎంత అనేది సరిగా తెలియచేయకుండా.. దరఖాస్తుల్లో సంతకాలు తీసుకుని వేధిస్తున్నారు. బాధితులు లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో 7కు చేరిన సంఖ్య
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!