Loan Apps: లోన్ యాప్స్ యమా డేంజర్.. వాటి జోలికి పోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కాల్ మనీ.. ఇప్పుడు లోన్ యాప్స్ (Loan Apps) కలవరం కలిగిస్తున్నాయి. లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్టీవీతో విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా (Kranthi Rana Tata) మాట్లాడారు. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరం…ప్రజలు ఎవ్వరూ లోన్ యాప్స్ లో మనీ తీసుకోవదన్నారు.
లోన్ అప్లయ్ చేసే క్రమంలోనే పూర్తి వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తున్నారు. మన ఫోన్ కాంటాక్స్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో వారు మన బంధువులకు కాల్ చేసి వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో మన అకౌంట్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వవద్దు. అందులో మహిళలు, చిన్నపిల్లల ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీలంగా తయారు చేసి పంపుతున్నారు. కాల్ సెంటర్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.ఈ లోన్ యాప్ లకు ఆర్బీఐ, ప్రభుత్వం అనుమతులు లేవు. ఇలాంటి వాటికి పబ్లిక్ దూరంగా ఉండాలన్నారు. రికవరీ ఏజెంట్స్ పై కూడా దృష్టి పెట్టాం అనీ, నందిగామ కేసులో రికవరీ కంపెనీలను, ఏజెంట్లను అరెస్టు చేసాం అని వివరించారు సీపీ క్రాంతిరాణా టాటా.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఇటీవల లోన్ యాప్స్ ఆగడాల వల్ల విద్యార్ధినులు, చిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వయానా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani govardhan reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anilkumar Yadav) లను కాల్ సెంటర్ ఏజెంట్లు వేధించిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఆ రికవరీ ఏజెంట్ల భరతం పట్టారు పోలీసులు. ఇంటికి వచ్చి మరీ వేధించడం ఎక్కువైంది. తమ ఫోన్ కాంటాక్ట్స్ లోని వ్యక్తులకు, మహిళలకు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమయిన, అభ్యంతకరమయిన మెసేజ్ లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం మరీ ఎక్కువైంది. దీంతో వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నారు. లోన్ యాప్స్ ద్వారా 10 వేలు రుణం తీసుకుంటే.. దానికి రెండుమూడురెట్లు రికవరీ చేస్తున్నారు. వడ్డీ ఎంత అనేది సరిగా తెలియచేయకుండా.. దరఖాస్తుల్లో సంతకాలు తీసుకుని వేధిస్తున్నారు. బాధితులు లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో 7కు చేరిన సంఖ్య
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!