Srisailam Dam Gates Opened: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది… కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇన్ ఫ్లో రూపంలో 1,08,000 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,00,374 క్యూసెక్కులుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.173 టీఎంసీలుగా ఉంది… ఉంది.. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,78,003 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండగా.. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నిండుకుండలా మారి గరిష్టస్థాయికి చేరింది నీటిమట్టం..
Read Also: RBI circular: అట్లయితే డబ్బులే. బంగారం ఇవ్వం. ఆర్బీఐ సర్క్యులర్.
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఇక, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం, వరుస సెలవులు కావడంతో.. శ్రీశైలం డ్యామ్ సందర్శనకు క్యూ కడుతున్నారు పర్యాటకులు.. ఇవాళ శ్రావణ శుక్రవారం సెలవు ఉండగా.. ఆ తర్వాత శని, ఆదివారాలే కావడంతో.. క్రమంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి, డ్యామ్ సందర్శనకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేస్తే.. అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. డ్యామ్ నుంచి గేట్ల ద్వారా వచ్చే నీరు.. మళ్లీ పైకి ఎగిసిపడితే.. మనసు పులకించిపోతుంది.. ఇక, ఆ నీటి తుంపర్లు.. ఘాట్ రోడులపై వెళ్తున్న వాహనాలపై కూడా పడుతుంటాయి.. వాటిలో తడిసి ముద్దవ్వడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు.. అందుకే గేట్లు ఎత్తివేసి సమయంలో.. శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.
మరోవైపు.. నాగార్జున సాగర్ డ్యామ్లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,19,763 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వచ్చి చేరుతుండగా.. కుడి కాలువకు 1,969 క్యూసెకులు, ఎడమ కాలువకు 3,490 క్యూసెకులు.. మొత్తంగా 12,104 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు.. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిలువ 240 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 563 అడుగులకు చేరింది.. శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చిచేరుతుండడంతో.. సాగర్లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది జులై నెల నుంచే నాగార్జున సాగర్కు వరద నీరు వచ్చిచేరుతోన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!