Cock fight: కోడి పందాల్లో అపశృతి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cock fight: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్ అయ్యేది..
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు వెళ్లాడు పద్మారావు అనే యువకుడు.. అయితే, కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకెళ్లాయి.. ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది.. కోడికి కట్టిన కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లిపోయింది.. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో పద్మారావు అక్కడికక్కడే కన్నుమూశాడు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రికి వచ్చేలోగానే పద్మారావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఇక, కిర్లంపూడి మండలం వేలంకలో మరో ఘటన చోటు చేసుకుంది.. గండే సురేష్ అనే వ్యక్తి కోడి పందాల దగ్గరకు వెళ్లాడు.. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు విడిచాడు..
ఇక, సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.. క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడ పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను సైతం పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. అయితే.. కోడిపందాలు, గుండాట ఆడే వారిపై రెండు రోజుల్లో 97 కేసులు నమోదు చేశామని చెబుతున్నారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. 210 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 132 పందెం కోళ్లు, 133 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు.. 49 గుండాట ఆడే బోర్డులను,1,09,355 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!