TTD Hundi: శ్రీవారిపై కాసుల వర్షం.. వరుసగా పదో నెల 100 కోట్లు దాటిన హుండీ ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై కనకవర్గం, కాసుల వర్షం కురుస్తూనే ఉంది.. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటడం ఇది వరుసగా 10వ నెల కావడం విశేషం.. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. ఈ నెలలో ఐదు సార్లు ఏకంగా 5 కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండి ఆదాయం… ఈ నెల 27వ తేదీన శ్రీవారికి రోండో అత్యధిక ఆదాయంగా 5.88 కోట్ల రూపాయలు లభ్యం అయ్యాయి.. కరోనా ఆంక్షల సడలింపు తర్వాత వరుసగా భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది.. ఇదే సమయంలో.. హుండీ ఆదాయం కూడా పెరిగిపోయింది.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతీ నెల 100 కోట్ల మార్క్ ని దాటేస్తోంది శ్రీవారి హుండీ ఆదాయం.. ఆగస్టు నెలలో అత్యధికంగా శ్రీవారికి హుండి ద్వారా రూ.140.34 కోట్ల రూపాయల ఆదాయం లభ్యం అయ్యింది.. ఇక, ఇదే ఏడాది జూలై 4వ తేదీన శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు.. మొత్తంగా వరుసగా 10వ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 మార్క్ను దాటడం విశేషంగా చెప్పుకోవాలి.. ఈ నెల ఇప్పటికే రూ.120.3 కోట్ల ఆదాయం రాగా.. ఈ నెల ముగింపునకు అది ఎంత వరకు చేరుతుందో చూడాలి.
Read Also: Nedurumalli Ramkumar Reddy: ఎమ్మెల్యే ఆనంపై నేదురుమల్లి కౌంటర్ ఎటాక్.. పవన్ ఆ మాట ఎందుకన్నాడు..?
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!