Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ రెండోసారి పెంచిన చార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసు టికెట్ల రేట్లలో తేడా వచ్చింది.. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలి.. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.
Read Also: COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
కాగా, ఈ మధ్య ఏపీఎస్ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందట.. టీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు.. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నాలుగైదు రోజుల్లోనే అత్యధిక ఓఆర్ తో ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెరగడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు సైతం ఏపీ ఆర్టీసీ బస్సుల ఆశ్రయించడంతో.. ఆ సంస్థపై సిరులు కురిపిస్తోంది.. ఇక రిజర్వేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్ సెస్ పెంచింది.. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచేసింది.. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇదే ఏపీ బస్సుల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ.. అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని కోరింది.
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!