Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ రెండోసారి పెంచిన చార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసు టికెట్ల రేట్లలో తేడా వచ్చింది.. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలి.. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.
Read Also: COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా, ఈ మధ్య ఏపీఎస్ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందట.. టీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు.. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నాలుగైదు రోజుల్లోనే అత్యధిక ఓఆర్ తో ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెరగడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు సైతం ఏపీ ఆర్టీసీ బస్సుల ఆశ్రయించడంతో.. ఆ సంస్థపై సిరులు కురిపిస్తోంది.. ఇక రిజర్వేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్ సెస్ పెంచింది.. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచేసింది.. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇదే ఏపీ బస్సుల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ.. అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని కోరింది.
తాజావార్తలు
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!