Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ రెండోసారి పెంచిన చార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసు టికెట్ల రేట్లలో తేడా వచ్చింది.. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలి.. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.
Read Also: COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
Also Read
కాగా, ఈ మధ్య ఏపీఎస్ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందట.. టీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు.. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నాలుగైదు రోజుల్లోనే అత్యధిక ఓఆర్ తో ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెరగడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు సైతం ఏపీ ఆర్టీసీ బస్సుల ఆశ్రయించడంతో.. ఆ సంస్థపై సిరులు కురిపిస్తోంది.. ఇక రిజర్వేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్ సెస్ పెంచింది.. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచేసింది.. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇదే ఏపీ బస్సుల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ.. అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని కోరింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!