శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష వాహనంపై విహరించనున్న శ్రీవారు.. 8వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం… రాత్రి హంస వాహనంపై.. 9వ తేదీ ఉదయం సింహ వాహనం… రాత్రి ముత్యపు పందిరి వాహనంలో.. 10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం… రాత్రి సర్వభూపాల వాహనంపై వివరిస్తారు.. 11వ తేదీ ఉదయం మోహిని అవతారంలో దర్శనమివ్వనున్న శ్రీవారిని రాత్రి గరుడ వాహనంపై ఊరేగిస్తారు.. 12వ తేదీ ఉదయం హనుమంత వాహనం… సాయంత్రం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం… రాత్రి గజ వాహనంపై విహరిస్తారు.. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం… రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు.. 14వ తేదీ ఉదయం రథం బదులుగా సర్వభూపాల వాహనం… రాత్రి అశ్వవాహనంపై ఊరేగుతారు.. ఇక, 15వ తేదీ ఉదయం చక్రస్నానం నిర్వహించనుండగా.. రాత్రి ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.