TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తూనే ఉంటారు.. అనునిత్యం 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూనే ఉంటారు.. ఇక, ప్రత్యేక రోజులు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.. మరోవైపు వేసవి సెలవుల్లో అయితే తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, వేసవి సెలవుల సందర్భంగా శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే.. నేరుగా స్వామివారి దర్శనం కలిపిస్తున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సామాన్య భక్తులకు దర్శనాలు సులువుగా జరిగిపోతున్నాయి..
Read Also: MEGA 157 : మెగా – అనిల్ షూటింగ్ ఎప్పటినుండో తెలుసా.?
మొత్తంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు.. ఇక, 27936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.. మరోవైపు.. రేపటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది టీటీడీ.. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించిన విషయం విదితమే..