Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల..
- రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
- ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలు
- వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతుంది. ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు చిన్నశేష వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 11 గంటలకు గరుడ వాహన సేవ, ఒంటిగంటకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి.
Read Also: Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..
Also Read
రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు ప్రత్యేక్షంగా స్వామివారి వాహన సేవలను వీక్షించే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా.. రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఈఓ శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రథసప్తమి వేడుకలను ప్రత్యేక్షంగా విక్షీంచేందుకు 2 లక్షల భక్తులు విచ్చేస్తారని అంచనా వేశారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అలాగే.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ కూడా నిలిపివేశారు. మరోవైపు.. గ్యాలరీలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తామని టీటీడీ పేర్కొంది.
Read Also: IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!