Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..
- విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో దర్యాప్తు ముమ్మరం
- కేసు దర్యాప్తుకు 3 వింగ్స్ ఏర్పాటు
- టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీల వివరాలు కనుకుంటున్న పోలీసులు
- అపార్ట్మెంట్లు స్థావరంగా ఏర్పాటు చేసుకున్న క్రికెట్ బుకీలు.
విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.. క్రికెట్ బుకీలు అపార్ట్మెంట్లే స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో.. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరమంతా జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 180 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మిగతా వాళ్ల అరెస్టు కోసం రంగం సిద్ధం చేశారు పోలీసులు.. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో పెద్ద తలకాయలు, కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారంతా.. విదేశాలకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
Read Also: Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
ఎన్టీవీతో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువకులు నష్టపోయారని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాకి సహకరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టామని సీపీ తెలిపారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశాం.. క్రికెట్ బెట్టింగ్లో ఎలాంటి వ్యక్తుల పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదన్నారు. రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు… అయితే విశాఖ సిటీ ప్రజలే తమకు ఇన్ఫార్మర్స్ అని ఎక్కడ బెట్టింగ్ నిర్వహించిన సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Also: US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్
తాజావార్తలు
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!