Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమారియం నియామకం.
- అంతకుముందు PIA సీఈఓగా ఎంపికైనట్లు కథనాలు.
- సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం PIA ఎదురుచూసినట్లు సమాచారం.
- ఇదే సమయంలో ఎయిర్ ఇండియాలో కీలక పదవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India New CEO: టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా ‘‘టెవోల్డే గెబ్రెమారియం(Tewolde Gebremariam) నియమితులయ్యారు. అయితే, ఆయన నిజానికి పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)కు సీఈఓగా వెళ్లాల్సిందని, సెక్యూరిటీ క్లియర్సెన్స్ పూర్తయ్యాక ఆయన పేరు ప్రతిపాదించాలని పీఐఏ భావించిందని, ఆలోపే ఎయిర్ ఇండియా అతడిని కొత్త సీఈఓగా నియమించినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల్లో ఉన్న పీఐఏను పాకిస్తాన్ ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు ఆ సంస్థను లాభాల బాట పట్టించే బాధ్యతల్ని టెవోల్డేకు అప్పగించాలని పాక్ భావించింది. విమానాల ఆధునీకీకరణ, ఇంటర్నేషనల్ మార్గాల విస్తరణ, ఆపరేషనల్ సంస్కరణతో పునరుద్ధరించాలని పీఐఏ భావించింది. అయితే, భద్రతా పరమైన అనుమతులు పూర్తవ్వకపోవడంతో ఆ నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
ఇదే సమయంలో ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించి టెవోల్డేను కొత్త సీఈఓగా నియమించింది. ప్రపంచంలో లాభాల్లో ఉన్న అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థల్లో ఒకటిగా ఉన్న, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ సీఈఓగా టెవోల్డే పనిచేశారు. 2011 నుంచి 2022 వరకు ఈ ఎయిర్ లైన్స్ ఎదుగుదలకు కారణమయ్యారు. ఇథియోపియన్ రాజధాని అడిస్ అబాబాను ఆఫ్రికాలోనే కీలకమైన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. విమానాల సంఖ్య, అంతర్జాతీయ మార్గాలు, నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా విస్తరించడానికి దోహదపడ్డారు.
2022లో ఆరోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆయన, ఇప్పుడు ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించనున్నారు. సీఈఓ నియామకంపై టెవోల్డే మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంస్థను మరింత విశ్వసనీయత, లాభదాయకంగా, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఎయిర్ లైన్గా తీర్చిదిద్దానని చెప్పారు.
తాజావార్తలు
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!