TTD: ఈనెల 28వ తేదీ నుండి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు
- ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
- అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈవో శ్యామల రావు
- డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పంచమి తీర్థానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు.. ఆ రోజు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఈవో తెలిపారు. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు ముందు రోజు రాత్రి నుండే భక్తులకు కేటాయించిన ప్రాంతాల్లో భోజనం మొదలుకొని అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయని ఈవో పేర్కొన్నారు. పంచమి రోజున 1500 మంది అదనపు సిబ్బందితో భద్రత ఉంటుందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.
Read Also: Kalpana Soran: కేబినెట్లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
అంతకుముందు బ్రహ్మోత్సవాలపై ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ఈవో జే శ్యామలరావు అన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..