Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుప్రీంకోర్టు
- తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ..
- కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుప్రీంకోర్టు..
- ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఎలా చెప్పగలరు?..
- నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా?..
- కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి..
- నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశాలు..
- తదుపరి విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా
Tirupati Laddu Controversy: సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది.. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది.. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని అడిగింది.. ఇక, లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు.. మైసూర్, ఘజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియర్ తీసుకోలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు..
Read Also: SWAG Theatrical Trailer: నాలుగు తరాలను ఒక్క సినిమాలో చూపించడం.. హీరో విష్ణుకే సొంతం
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇవి ఆందోళన కలిగించే అంశాలు. ప్రజల మధ్య ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని ప్రకటన చేశారు.. ఆరోపణల అనంతరం టీటీడీ అధికారి స్వయంగా కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు.. సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.. దేవుడి ప్రసాదం ప్రశ్నార్థకంగా ఉంటే దానిని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.. స్వచ్ఛమైన అనుమతించదగిన పదార్థాలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించగలవని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ ఉంది. ముఖ్యమంత్రి ఆ ప్రకటనను కొట్టిపారేశారని.. కల్తీ నెయ్యి 100 శాతం వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారని పేర్కొన్నారు.. శాంప్లింగ్ జరిగిందా? తిరస్కరించబడిన నమూనాల నుండి నమూనా తీసుకోబడిందా? ఏ సరఫరాదారు ఆందోళన చెందారు? తప్పుడు నివేదికకు అవకాశం ఉందా? అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు..
Read Also: Ravindra Jadeja: టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న జడ్డూ భాయ్..
ఇక, ప్రసాద కల్తీ పై రాజకీయ జోక్యాన్ని అనుమతించాలా? బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారనే దానిపై మేం ఆందోళన చెందుతున్నామని సుబ్రమణ్యస్వామి తరపున లాయర్ వాదించారు.. మరోవైపు.. తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం… కలుషిత నెయ్యి ఉపయోగించినట్లయితే, అది ఆమోదయోగ్యం కాదు. బాధ్యులెవరో దర్యాప్తు జరగాలి.. వాస్తవాలు తెలియాలంటే విచారణ జరగాలని కోరారు.. అయితే, ఈ విషయంలో ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. ఇక్కడ ఏం కనిపించడం లేదన్న కోర్టు.. వాల్యూలో మార్పులకు కారణాలుగా ల్యాబ్ లు కొన్ని అంశాలు ఉన్నాయి.. కేంద్రం విచారణలో జోక్యం చేసుకుంటుందా..? సీట్ సరిపోతుందా..? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా..? లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది సుప్రీంకోర్టు.. ఇక, తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!