Tirupati Laddu Controversy: లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్ బృందం..
- తిరుమల లడ్డూ వివాదం.. రంగంలోకి సిట్..
- ఇవాళ తిరుపతిలో విచారణ జరపనున్న సిట్ టీమ్..
- ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలపై ఆసక్తి..
- సంచలనంగా మారిన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు..
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది.
Read Also: Hydra Commissioner: కూకట్పల్లి లో చనిపోయిన మహిళకు.. హైడ్రా తో ఎలాంటి సంబంధం లేదు..
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీమ్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది. ఇవాళ తిరుపతికి సిట్ వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటేల్స్ తీసుకోనుంది. తొలుత AR డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు.. టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు.. ఆ కంపెనీల లావాదేవీలేంటి.. దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు లాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేయనుంది. నెయ్యిపై గతంలో, రీసెంట్గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది. మరోవైపు.. టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ ఛైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది. చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని పరిశీలించనుంది.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?