Tirupati Laddu Controversy: లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్ బృందం..
- తిరుమల లడ్డూ వివాదం.. రంగంలోకి సిట్..
- ఇవాళ తిరుపతిలో విచారణ జరపనున్న సిట్ టీమ్..
- ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలపై ఆసక్తి..
- సంచలనంగా మారిన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది.
Read Also: Hydra Commissioner: కూకట్పల్లి లో చనిపోయిన మహిళకు.. హైడ్రా తో ఎలాంటి సంబంధం లేదు..
Also Read
తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీమ్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది. ఇవాళ తిరుపతికి సిట్ వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటేల్స్ తీసుకోనుంది. తొలుత AR డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు.. టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు.. ఆ కంపెనీల లావాదేవీలేంటి.. దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు లాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేయనుంది. నెయ్యిపై గతంలో, రీసెంట్గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది. మరోవైపు.. టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ ఛైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది. చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని పరిశీలించనుంది.
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!