TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: అయోధ్య రామ మందిరంలో విరాళాల నిర్వహణకు సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న టీటీడీ.. తన అకౌంటింగ్, ఆడిట్ వ్యవస్థలను ఆధునీకరించేందుకు భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ICAI) సహాయాన్ని కోరింది. ఈ విషయాన్ని ICAI అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభమైందని, 100 రోజుల్లో కొత్త వ్యవస్థకు సంబంధించిన రూపకల్పన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
టీటీడీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంటింగ్ వ్యవస్థ దాదాపు రెండు దశాబ్దాలకు ముందు నాటిదని ఆయన అన్నారు. కొత్త విధానాన్ని పూర్తిగా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ICAIకి చెందిన ప్రత్యేక విభాగం ‘అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టు కేవలం టీటీడీకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర దేవాలయాలు, ధార్మిక & సేవా సంస్థలకు కూడా ఆదర్శంగా నిలవాలని ICAI భావిస్తోంది. టీటీడీ కోసం రూపొందించే అకౌంటింగ్ మాన్యువల్ను భవిష్యత్తులో ఇతర సంస్థల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అయోధ్య రామ మందిరంలో వెలుగులోకి వచ్చినట్లు ప్రచారంలో ఉన్న ఆర్థిక అవకతవకలపై స్పందిస్తూ.. తమకు మీడియా కథనాలు మినహా ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే నగదు, చెక్కులు లేదా బ్యాంకింగ్ లావాదేవీలు ఏవైనా సరే.. పటిష్టమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థ ఉంటే నిధుల లీకేజీకి అవకాశం ఉండదని పేర్కొన్నారు. ICAI ఉపాధ్యక్షుడు మంగేష్ పాండురంగ్ కినారే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ కోసం సిద్ధం చేస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గతంలో భారతీయ రైల్వేలు, ఇండియా పోస్ట్ వంటి ప్రభుత్వ సంస్థలకు కూడా ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసిన అనుభవం తమకు ఉందని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!