Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: టాలీవుడ్లో హీరోల రెమ్యునరేషన్పై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. స్టార్ హీరోల పారితోషికాలు పెరగడంతో సినిమా బడ్జెట్లు భారీగా పెరుగుతున్నాయని, నిర్మాతలపై ఆర్థిక భారం కూడా అదే స్థాయిలో పెరుగుతోందని పరిశ్రమలో తరచూ వినిపించే మాట. ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత దిల్రాజు ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్, బాలీవుడ్లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.
ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న దిల్రాజు, స్టార్ హీరోల పారితోషికాల గురించి మాట్లాడారు. సినిమా మార్కెట్ పరిస్థితిని హీరోలకు ముందుగానే వివరిస్తానని, తాను ఎంత వరకు పారితోషికం ఇవ్వగలనో స్పష్టంగా చెబుతానని అన్నారు. తన పరిస్థితిని అర్థం చేసుకునే హీరోలతోనే సినిమాలు చేస్తానని వెల్లడించారు. అయితే అగ్ర హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరని, దానికి ప్రధాన కారణం వారి ఇమేజ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వారు రెమ్యునరేషన్ తగ్గించేందుకు వెనుకాడతారని వివరించారు. ఇక 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే సినిమాలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు మొత్తం హీరో పారితోషికానికే వెళ్తుందని వెల్లడించారు.
Also Read
- Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
- Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
- Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
ఈ సందర్భంగా బాలీవుడ్లో అమలవుతున్న విధానాన్ని కూడా దిల్రాజు ప్రస్తావించారు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో చాలామంది స్టార్ హీరోలు ముందస్తుగా భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే, సినిమా లాభాల్లో వాటా తీసుకునే ప్రాఫిట్ షేరింగ్ మోడల్ను అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ విధానం నిర్మాతలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా విజయం సాధిస్తే హీరోలకు కూడా మంచి ఆదాయం వస్తుందని, అదే సమయంలో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా నిర్మాతపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.
ఈ విషయాన్ని వివరిస్తూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను ఉదాహరణగా ప్రస్తావించారు దిల్రాజు. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సుమారు130 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారని, అయితే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు లాభాల పంపిణీ విధానాన్ని ఎంచుకున్నారని చెప్పారు. దీంతో నిర్మాతలకు పెట్టుబడి తిరిగి రావడం సులభమవుతుందని, అలాగే హీరోలకు కూడా సినిమా విజయంపై మరింత బాధ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు చిత్రసీమలో మాత్రం ఈ తరహా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని దిల్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే నిర్మాతలు, హీరోలు ఇద్దరికీ మంచి జరగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దిల్రాజు చేసిన ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్ రెమ్యునరేషన్ పై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
-
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!