Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- ప్రధాని నరేంద్ర మోడీ ఒక కర్మ యోగి..
- ప్రధాని దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
- మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపి జాతి గౌరవాన్ని చాటిరు: పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: శ్రీ ఆదిశంకరాచార్యులు, శివుని సజీవ స్వరూపంగా గౌరవించబడ్డారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం యొక్క ఏకీకృత మార్గం క్రింద విభిన్నమైన ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసాలను శంకరాచార్యులు ఒక చోట చేర్చారు అని తెలిపారు. అలాగే, స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మందిని ఏకం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు కూడగట్టేందుకు మహాత్మా గాంధీ చాలా దూరం నడిచారు.. అలాగే, ఆచార్య వినోబా భావే దేశం మొత్తం తిరిగి.. పేదల అభ్యున్నతి కోసం తమ భూములను స్వచ్ఛందంగా వదులుకునేలా భూస్వాములను ప్రేరేపించారు అని చెప్పుకొచ్చారు. ఇక, చాలా మంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణాన్ని పునరావృతం చేయగలరు.. కానీ అన్ని నడకలు పరివర్తనను తీసుకురాలేవు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Vizianagaram: రాడ్లతో టోల్గేట్ సిబ్బంది హల్చల్.. ఓ కారు డ్రైవర్పై దాడి
Also Read
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఇక, ఉన్నత లక్ష్యం లేని నడక ప్రజానీకాన్ని ప్రేరేపించదు.. దేశాన్ని ఏకం చేయదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం వైవిధ్యం, చైతన్యాన్ని కలిగి ఉంది.. అది అర్థమవ్వాలంటే.. ఆత్మతో నిమగ్నమవ్వాలి అని సూచించారు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భౌతిక ప్రయాణం అవసరం లేకుండా.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో ప్రధాని వ్యవహరించారు.. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని పటిష్టం చేశాయన్నారు. అలాగే, తమిళనాడులోని సనాతన ధర్మానికి పవిత్ర చిహ్నమైన సెంగోల్ను ఢిల్లీలోని పార్లమెంట్లో ప్రతిష్టించడంతో మన ఐక్యత, సంప్రదాయానికి గల గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
A Simple Step, A Long Walk…A Great Transformation !
Sri Adi Shankaracharya, revered as the living embodiment of Lord Shiva, brought together diverse systems of worship and spiritual practices under one unified path of Sanatana Dharma. Mahatma Gandhi walked to rally support for… pic.twitter.com/PPdmxWkuUo
— Pawan Kalyan (@PawanKalyan) October 2, 2024
తాజావార్తలు
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?