Events in November at Tirumala: ఉత్సవాల సీజన్గా మారిన నవంబర్.. తిరుమలలో జరిగే విశేష కార్యక్రమాలు ఇవే..
- తిరుమలలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాలు..
- 5వ తేదీన నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ..
- 8వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ..
- 9వ తేదీన వార్షిక పుష్పయాగం..
- 13వ తేదీన కైసిక ద్వాదశి నాడు ప్రత్యేకంగా ఆస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Events in November at Tirumala: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారింది. శ్రీవారి ఆలయంలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో వూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే తరహలో నవంబర్ మాసంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ముందుగా నవంబర్ 5వ తేదీన నాగుల చవితి సందర్భంగా శ్రీవారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు మలయప్పస్వామి. వార్షిక బ్రహ్మోత్సవాలు తరువాత స్వామివారు పెద్దశేష వాహనాలపై భక్తులకు దర్శనం ఇచ్చేది ఒక్క నాగుల చవితి పర్వదినం రోజునే. అటు తరువాత 8వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చెయ్యనున్నారు అర్చకులు. 9వ తేదీన వార్షిక పుష్పయాగం నిర్వహిస్తారు.. స్వామివారికి 10 టన్నలు పుష్పాలతో 7 సార్లు హృదయం వరకు పుష్పార్చన నిర్వహించనున్నారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం మండపంలో పుష్పయాగాని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ..
Read Also: Nandyal Crime: పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..
ఇక, నవంబర్ 13వ తేదీన కైసిక ద్వాదశి నాడు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో వేకువజామున ఉగ్రశ్రీనివాసమూర్తి భక్తులు మాడవీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. శ్రీవారి ఆలయంలోని గర్బాలయంలో పంచబేరాలు వుంటాయి. అందులో ఉగ్రశ్రీనివాసమూర్తిని కౌతుక బేరంగా పిలుస్తారు. ఒక్క కౌశిక ద్వాదశి రోజున మాత్రమే ఉగ్రశ్రీనినాసమూర్తి విగ్రహాలు ఆలయం వెలుపలకు వేంచేపు చేస్తారు. అది కూడా సూర్యోదయం లోపు స్వామివారి మాడవీధుల ఉరేగింపు నిర్వహిస్తారు. నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు మలయప్పస్వామి గరుడు వాహనం పై మాడవీధులలో ఉరేగుతు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇలా నవంబర్ నెలలో వరుసగా స్వామివారి ఆలయంలో విశేష పర్వదినాలు సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..