Temple : మాయమైన హుండీ డబ్బులు ప్రత్యక్షం.. అంతా మిస్టరీ
- పిల్లల వైద్యం కోసం ఆస్పత్రిలో కొంత డబ్బు ఖర్చు
- సొమ్మును లెక్కించడంతో నగదు మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temple : అమ్మోరు తల్లి.. క్షమించు… తెలియక తప్పు చేశాం.. నీ ఆలయంలో దొంగతనం చేయడం నేరమే.. అందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇవిగో నీ దగ్గర దొంగిలించిన సొమ్ము.. నీవే తీసుకో తల్లి. దయచేసి మమ్మల్ని ఒగ్గెయ్ తల్లి…. ఇదీ దొంగలు రాసిన లేఖ. అదే ఆలయంలో చోరీ చేసి.. తిరిగి ఆ సొమ్మును అమ్మవారి ఆలయం వద్దే తీసుకు వచ్చి పెట్టేశారు. పైగా అందులో.. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగింది. దొంగలు చేసిన ఈ విచిత్ర పనికి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ దేవాలయం ఇది. ఈ ఆలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది. నేరుగా ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ దోచుకుని వెళ్లారు. దాదాపు 2 లక్షల రూపాయల వరకు హుండీలో ఉన్న సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. అప్పట్లో పోలీసులకు కూడా ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు దొంగలు దొరకలేదు. కేసు ఇంకా దర్యాప్తు స్టేజ్లోనే ఉంది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఆలయ ఆవరణలో అద్భుతం జరిగింది. పోయింది అనుకున్న హుండీ డబ్బు.. ఆలయ ఆవరణలోని ఓ మూటలో ప్రత్యక్షమైంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తలు, ఇతర సిబ్బంది.. మూటని తెరిచి చూశారు. అందులో హుండీ సొమ్ముతో పాటు లేఖ కూడా ఉంది. అది దొంగలు రాసిన లేఖ. ఆలయంలో నెల రోజుల క్రితం నలుగురం కలిసి దొంగతనం చేశామని.. కానీ అప్పటి నుంచి తమ పిల్లలకు ఆరోగ్యాలు బాగా ఉండడం లేదని..కాబట్టి అమ్మవారి సొమ్ము అమ్మవారికే అప్పచెప్పుతున్నామని అందులో రాశారు.
ఆ లేఖలో దొంగలు చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. పిల్లలు అనారోగ్యాల పాలైన కారణంగా కొంత డబ్బు ఆస్పత్రి ఖర్చులకు వాడుకున్నామని లేఖలో తెలిపారు. ఐతే మూటలోని సొమ్మును లెక్కించడంతో రూ. లక్షా 86వేల నగదు ఉన్నట్లుగా తేలింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చివరగా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పోయిందనుకున్న అమ్మవారి సొమ్ము తిరిగి రావడంతో ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు…
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!