Temple : అమ్మోరు తల్లి.. క్షమించు… తెలియక తప్పు చేశాం.. నీ ఆలయంలో దొంగతనం చేయడం నేరమే.. అందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇవిగో నీ దగ్గర దొంగిలించిన సొమ్ము.. నీవే తీసుకో తల్లి. దయచేసి మమ్మల్ని ఒగ్గెయ్ తల్లి…. ఇదీ దొంగలు రాసిన లేఖ. అదే ఆలయంలో చోరీ చేసి.. తిరిగి ఆ సొమ్మును అమ్మవారి ఆలయం వద్దే తీసుకు వచ్చి పెట్టేశారు. పైగా అందులో.. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటన అనంతపురం…
ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం.…