Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు
- క్షుద్రపూజల కోసం ఎవరో తవ్వినట్లు పుకార్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ రవివర్మకి భూమి విక్రయం తమ గుంట జాగాలో 4 సమాధుల నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయి. గోతులు ఉన్నాయి కానీ… అందులో అస్తికలు మాయమయ్యాయి. గ్రామస్తులు, ఆ సమాధులకు చెందిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు..!! చనిపోయిన తమ బంధువుల అస్తికలను ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారని ఆందోళన చెందారు..? క్షుద్రపూజలేమైనా జరిగాయా.. అని కంగారెత్తారు..!! ఇంతకూ సమాధులను ఎవరు తవ్వినట్టు…!! నిజంగానే క్షుద్రపూజలు జరిగాయా..? అస్తికల మాయం వెనక దాగున్న మిస్టరీ ఏంటి.. మహేశ్వరం మండలం డబిల్ గూడలో సర్వే నెంబర్ 24లో ఉన్న స్థలం. ఈ స్థలంలో దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఉండేవి. రాత్రికి రాత్రి ఈ సమాధులు మాయం అయ్యాయి. అస్తికలు కూడా కనిపించకుండాపోయాయి. విషయం తెలుసుకున్న సమాధులకు చెందిన కుటుంబసభ్యులు.. ఆ స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన తమ కుటుంబసభ్యులకు చెందిన సమాధులను ఎవరు తవ్వారో తెలియక ఆందోళన చెందారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పోగయ్యారు.
Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఒకానొక దశలో క్షుద్రపూజల కోసం ఎవరో తవ్వినట్లు ఉన్నారు అంటూ పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ.. ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాధులను తవ్వి.. అస్తికలను కూడా మాయం చేసింది రియల్ ఎస్టేట్ గద్దలని తెలుసుకున్నారు. తమ వెంచర్కి సమాధులు అడ్డుగా ఉన్నాయని.. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే సమాధులను పెకిలించేశారు. అస్తికలను కూడా మాయం చేశారు… జన్యపాగ కుటుంబానికి చెందిన వ్యక్తులు… 2006లో తమ 3 ఎకరాల 5 గుంటల భూమిని సినిమా డిస్ట్రిబ్యూటర్ రవివర్మకి అమ్మారు. ఒక గుంట మినహా.. స్థలం మొత్తాన్ని అమ్మారు. ఆ గుంట జాగాలో తమ కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేందుకు ఆ గుంట స్థలాన్ని మాత్రం ఉంచుకున్నారు. ఈ 19 ఏళ్లలో చనిపోయిన తమ వాళ్ల 4 సమాధులు అక్కడే నిర్మించారు.
వీళ్ల స్థలం కొన్న రవివర్మ.. తన స్థలంలోకి వెళ్లాలంటే సమాధులు అడ్డుగా ఉన్నాయని భావించాడు. కనీసం జన్యపాగ కుటుంబీకులకు సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే సమాధులను తొలగించాడు రవివర్మ. కనీసం అస్థికలు కూడా లేకుండా మాయం చేశారు… కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని… సమాధుల నుంచి తొలగించిన అస్తికలను తమకు అప్పగించేలా చూడాలని కోరుతున్నారు జన్యపాగ కుటుంబసభ్యులు. సమాధులు తవ్విన చోట కూర్చుని ఆందోళన చేశారు. ఘటనపై రవివర్మను సంప్రదించగా.. తనకేం సంబంధం లేదంటున్నాడని చెప్తున్నారు బాధితులు.
Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!