Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు
- క్షుద్రపూజల కోసం ఎవరో తవ్వినట్లు పుకార్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ రవివర్మకి భూమి విక్రయం తమ గుంట జాగాలో 4 సమాధుల నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయి. గోతులు ఉన్నాయి కానీ… అందులో అస్తికలు మాయమయ్యాయి. గ్రామస్తులు, ఆ సమాధులకు చెందిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు..!! చనిపోయిన తమ బంధువుల అస్తికలను ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారని ఆందోళన చెందారు..? క్షుద్రపూజలేమైనా జరిగాయా.. అని కంగారెత్తారు..!! ఇంతకూ సమాధులను ఎవరు తవ్వినట్టు…!! నిజంగానే క్షుద్రపూజలు జరిగాయా..? అస్తికల మాయం వెనక దాగున్న మిస్టరీ ఏంటి.. మహేశ్వరం మండలం డబిల్ గూడలో సర్వే నెంబర్ 24లో ఉన్న స్థలం. ఈ స్థలంలో దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఉండేవి. రాత్రికి రాత్రి ఈ సమాధులు మాయం అయ్యాయి. అస్తికలు కూడా కనిపించకుండాపోయాయి. విషయం తెలుసుకున్న సమాధులకు చెందిన కుటుంబసభ్యులు.. ఆ స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన తమ కుటుంబసభ్యులకు చెందిన సమాధులను ఎవరు తవ్వారో తెలియక ఆందోళన చెందారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పోగయ్యారు.
Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఒకానొక దశలో క్షుద్రపూజల కోసం ఎవరో తవ్వినట్లు ఉన్నారు అంటూ పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ.. ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాధులను తవ్వి.. అస్తికలను కూడా మాయం చేసింది రియల్ ఎస్టేట్ గద్దలని తెలుసుకున్నారు. తమ వెంచర్కి సమాధులు అడ్డుగా ఉన్నాయని.. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే సమాధులను పెకిలించేశారు. అస్తికలను కూడా మాయం చేశారు… జన్యపాగ కుటుంబానికి చెందిన వ్యక్తులు… 2006లో తమ 3 ఎకరాల 5 గుంటల భూమిని సినిమా డిస్ట్రిబ్యూటర్ రవివర్మకి అమ్మారు. ఒక గుంట మినహా.. స్థలం మొత్తాన్ని అమ్మారు. ఆ గుంట జాగాలో తమ కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేందుకు ఆ గుంట స్థలాన్ని మాత్రం ఉంచుకున్నారు. ఈ 19 ఏళ్లలో చనిపోయిన తమ వాళ్ల 4 సమాధులు అక్కడే నిర్మించారు.
వీళ్ల స్థలం కొన్న రవివర్మ.. తన స్థలంలోకి వెళ్లాలంటే సమాధులు అడ్డుగా ఉన్నాయని భావించాడు. కనీసం జన్యపాగ కుటుంబీకులకు సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే సమాధులను తొలగించాడు రవివర్మ. కనీసం అస్థికలు కూడా లేకుండా మాయం చేశారు… కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని… సమాధుల నుంచి తొలగించిన అస్తికలను తమకు అప్పగించేలా చూడాలని కోరుతున్నారు జన్యపాగ కుటుంబసభ్యులు. సమాధులు తవ్విన చోట కూర్చుని ఆందోళన చేశారు. ఘటనపై రవివర్మను సంప్రదించగా.. తనకేం సంబంధం లేదంటున్నాడని చెప్తున్నారు బాధితులు.
Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!