Ambati Rambabu: అమరావతి కథ అంతులేని కథలా మారింది..
- చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి..
- అమరావతి కథ అంతులేని కథలా మారింది.. చంద్రబాబు దోచుకుంటున్నారు..
- అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారింది..
- 50 వేల ఎకరాలతో అత్యుత్తమ రాజధాని కడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు భూములు ఇచ్చారు.. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని కడతామని ప్రగల్భాలు పలికారు.. రెండవ దశలో 16,666 ఎకరాలు.. ప్రభుత్వం భూములతో కలిపి 20 ఎకరాలు సేకరించాలని కేబినెట్ లో చర్చించారు.. మళ్ళీ మూడవ దశ కూడా ఉంటుందంటున్నారు.. గతంలో రైతుల దగ్గర భూములు తీసుకునే సమయంలో ఇన్ని దశల్లో భూసేకరణ ఉంటుందని చెప్పలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Kapil Dev: హెడ్కోచ్గా గంభీర్ కొనసాగాలా? వద్దా?.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
అయితే, రైతులకు ఇన్నాళ్లు గడిచినా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. అసలు ఫూలింగ్ లో లేని చోట్ల ఇస్తామంటున్నారు.. అసలు రైతులకు సమాధానాలు చెప్పేవారు లేరు.. ఒక్క మంత్రి కూడా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. గతంలో రైతులను త్యాగధనులు అన్నారు.. ఇప్పుడు కనీసం వారి గురించి పట్టించుకోవటం లేదు.. గతంలో 50 వేల ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని అన్నారు.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలి అంటున్నారు.. చంద్రబాబు అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములకు లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 4 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు.. చంద్రబాబు మళ్లీ వస్తే మా భూముల ధరలు పెరుగుతాయని రైతులు అనుకున్నారు.. ఇంత వరకు ఎక్కడా భూముల ధరలు పెరగలేదు.. ఇప్పటివరకు అమరావతిలో ఒక్క తట్ట మట్టి అయినా ఎత్తిపోసారా అని అంబటి ప్రశ్నించారు.
Read Also: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా?
కానీ, మొబలైజేషన్ అడ్వాన్సుల పేరు చెప్పి 3 వేల కోట్లు ఇచ్చారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టేశారు.. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు.. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డబ్బాలు కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు.. పలు సంస్థల నుంచి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.. ఇంకా చాలా అప్పులు పైప్ లైన్ లో ఉన్నాయి.. అమరావతిలో గతంలో 41 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే.. కేవలం 5 వేల కోట్ల పనులు మాత్రమే చేయించారు.. ఇప్పుడు ఆ పనులకు మళ్ళీ రీ టెండర్లు పిలిచారు.. గతంలో పెండింగ్ లో ఉన్న 35 వేల కోట్ల పనుల విలువను 48 వేల కోట్లకు పెంచారు.. అమరావతి విషయంలో చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు.. కేవలం దోచుకోవటమే పనిగా చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్నారని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..