Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi The Amaravati Has Become A Never Ending Story Ambati Rambabu

Ambati Rambabu: అమరావతి కథ అంతులేని కథలా మారింది..

Published Date :November 29, 2025 , 4:01 pm
By Chandra Shekhar Pamena
  • చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి..
  • అమరావతి కథ అంతులేని కథలా మారింది.. చంద్రబాబు దోచుకుంటున్నారు..
  • అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారింది..
  • 50 వేల ఎకరాలతో అత్యుత్తమ రాజధాని కడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు: అంబటి రాంబాబు
Ambati Rambabu: అమరావతి కథ అంతులేని కథలా మారింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rambabu: ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు భూములు ఇచ్చారు.. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని కడతామని ప్రగల్భాలు పలికారు.. రెండవ దశలో 16,666 ఎకరాలు.. ప్రభుత్వం భూములతో కలిపి 20 ఎకరాలు సేకరించాలని కేబినెట్ లో చర్చించారు.. మళ్ళీ మూడవ దశ కూడా ఉంటుందంటున్నారు.. గతంలో రైతుల దగ్గర భూములు తీసుకునే సమయంలో ఇన్ని దశల్లో భూసేకరణ ఉంటుందని చెప్పలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Kapil Dev: హెడ్‌కోచ్‌గా గంభీర్‌ కొనసాగాలా? వద్దా?.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Also Read

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

అయితే, రైతులకు ఇన్నాళ్లు గడిచినా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. అసలు ఫూలింగ్ లో లేని చోట్ల ఇస్తామంటున్నారు.. అసలు రైతులకు సమాధానాలు చెప్పేవారు లేరు.. ఒక్క మంత్రి కూడా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. గతంలో రైతులను త్యాగధనులు అన్నారు.. ఇప్పుడు కనీసం వారి గురించి పట్టించుకోవటం లేదు.. గతంలో 50 వేల ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని అన్నారు.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలి అంటున్నారు.. చంద్రబాబు అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములకు లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 4 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు.. చంద్రబాబు మళ్లీ వస్తే మా భూముల ధరలు పెరుగుతాయని రైతులు అనుకున్నారు.. ఇంత వరకు ఎక్కడా భూముల ధరలు పెరగలేదు.. ఇప్పటివరకు అమరావతిలో ఒక్క తట్ట మట్టి అయినా ఎత్తిపోసారా అని అంబటి ప్రశ్నించారు.

Read Also: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా?

కానీ, మొబలైజేషన్ అడ్వాన్సుల పేరు చెప్పి 3 వేల కోట్లు ఇచ్చారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టేశారు.. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు.. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డబ్బాలు కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు.. పలు సంస్థల నుంచి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.. ఇంకా చాలా అప్పులు పైప్ లైన్ లో ఉన్నాయి.. అమరావతిలో గతంలో 41 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే.. కేవలం 5 వేల కోట్ల పనులు మాత్రమే చేయించారు.. ఇప్పుడు ఆ పనులకు మళ్ళీ రీ టెండర్లు పిలిచారు.. గతంలో పెండింగ్ లో ఉన్న 35 వేల కోట్ల పనుల విలువను 48 వేల కోట్లకు పెంచారు.. అమరావతి విషయంలో చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు.. కేవలం దోచుకోవటమే పనిగా చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్నారని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati land prices
  • Ambati Rambabu
  • Andhra Pradesh
  • chandrababu
  • tdp

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions