TTD: శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట..! టీటీడీ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి శ్రీవారిని దర్శన విదానాన్ని కూడా మార్చేసింది.. ప్రత్యేక దర్శనం అయినా.. సర్వదర్శనం అయినా టికెట్లు తప్పనిసరి చేసింది టీటీడీ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా.. ఆన్లైన్లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తోంది.. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.. క్యూలైన్లో పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువరు భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Farmers: ఎంపీ అర్వింద్కు నిరసన సెగ.. ఇంటి ముందు వడ్లు పోసి ఆందోళన..
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గోవిందరాజస్వామి సత్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.. క్యూ లైన్లలో తోపులాటలతో పదుల సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.. తాగేందుకు కనీసం నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసి భక్తులు.. టికెట్ల జారీలో టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. భక్తుల తోపులాటలో చాలామంది పిల్లలు తప్పిపోయినట్టు చెబుతున్నారు.. పోలీసుల లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని భక్తులు వాపోయారు.. ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ స్పందించలేదని విమర్శిస్తున్నారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పుట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. టికెట్లు లోకపోయినా సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.. నేరుగా కొండపైకి చేరుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారి పరిస్థితి ఏంటి? అనేది తెలియాల్సి ఉన్నా.. మరోవైపు.. భక్తుల రద్దీని దృష్టిలోపెట్టుకున్న టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది టీటీడీ.
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!