నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికలు.. అక్రమాలపై టీడీపీ సీరియస్
ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధికారుల పక్షపాత వైఖరిపై మండిపడుతోంది. అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదంటోంది.
కొంత మంది రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్స్ తిరస్కరించారు. ఆరు డివిజన్లలో అభ్యర్దులు కరువయ్యారు. వైసీపీకి ఏడుకి పైగా కార్పోరేటర్లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారని దానిపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు టీడీపీ నేతలు
తాజావార్తలు
-
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
-
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
-
Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
-
Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
-
CSK Injury Update: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!