Tdp Vs Ysrcp War: నెల్లూరులో లేఅవుట్ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వేసిన లే ఔట్ కు బినామీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలు చేశారు.
దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న మూడు సంవత్సరాలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ వందలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ..అక్రమ లే ఔట్ ల వెనుక ఆయనే ఉన్నారని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కిన్నెర ప్రసాద్ 2020 లో వైసీపీలోకి వచ్చారని అంతకుమునుపు టీడీపీలో వుంటూ పలు లే ఔట్ లు వేశారని..వాటిల్లో కూడా కోట్ల మేర అవినీతి జరిగిందా అని అనిల్ ఎదురు ప్రశ్నలు వేశారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
అనిల్ ఆరోపణల పై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరడంతో పాటు అక్రమ లే ఔట్ ల పై విచారణ చేయాలని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ లే ఔట్ ల కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన అనిల్…దీనిపై ప్రమాణం కూడా చేస్తానని అన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలోనే అక్రమాలు అధికంగా జరిగాయని చెప్పారు. తాను కూడా అనిల్ అవినీతిని నిరూపిస్తానని కోటం రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. నగర పరిధిలో అనిల్ అనుచరులు ప్రభుత్వ శివారు భూములను ఆక్రమించుకుని లే ఔట్లు వేశారని దానిని తాను నిరూపిస్తానని కోటంరెడ్డి చెబుతున్నారు.
నెల్లూరు నగరంలోని మూడో మైలు ప్రాంతంలోని ప్రశాంతి నగర్ లో అనిల్ అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంతో పాటు అక్రమ లే ఔట్ ల ద్వారా విక్రయిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అనిల్ బాగోతం బట్టబయలు అవుతుండటంతోనే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో విచారణకు అంగీకరిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎవరి హయాంలో ఎన్ని అక్రమ లే ఔట్లు వేశారు. ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే విషయంతో పాటు అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!