నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్…
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు…