Tdp Vs Ysrcp War: నెల్లూరులో లేఅవుట్ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వేసిన లే ఔట్ కు బినామీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలు చేశారు.
దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న మూడు సంవత్సరాలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ వందలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ..అక్రమ లే ఔట్ ల వెనుక ఆయనే ఉన్నారని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కిన్నెర ప్రసాద్ 2020 లో వైసీపీలోకి వచ్చారని అంతకుమునుపు టీడీపీలో వుంటూ పలు లే ఔట్ లు వేశారని..వాటిల్లో కూడా కోట్ల మేర అవినీతి జరిగిందా అని అనిల్ ఎదురు ప్రశ్నలు వేశారు.
Also Read
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి 'పాడే యాత్రే'.!
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
అనిల్ ఆరోపణల పై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరడంతో పాటు అక్రమ లే ఔట్ ల పై విచారణ చేయాలని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ లే ఔట్ ల కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన అనిల్…దీనిపై ప్రమాణం కూడా చేస్తానని అన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలోనే అక్రమాలు అధికంగా జరిగాయని చెప్పారు. తాను కూడా అనిల్ అవినీతిని నిరూపిస్తానని కోటం రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. నగర పరిధిలో అనిల్ అనుచరులు ప్రభుత్వ శివారు భూములను ఆక్రమించుకుని లే ఔట్లు వేశారని దానిని తాను నిరూపిస్తానని కోటంరెడ్డి చెబుతున్నారు.
నెల్లూరు నగరంలోని మూడో మైలు ప్రాంతంలోని ప్రశాంతి నగర్ లో అనిల్ అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంతో పాటు అక్రమ లే ఔట్ ల ద్వారా విక్రయిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అనిల్ బాగోతం బట్టబయలు అవుతుండటంతోనే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో విచారణకు అంగీకరిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎవరి హయాంలో ఎన్ని అక్రమ లే ఔట్లు వేశారు. ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే విషయంతో పాటు అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి.. ఎక్కడంటే..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!