Tdp Vs Ysrcp War: నెల్లూరులో లేఅవుట్ పాలిటిక్స్
నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వేసిన లే ఔట్ కు బినామీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలు చేశారు.
దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న మూడు సంవత్సరాలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ వందలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ..అక్రమ లే ఔట్ ల వెనుక ఆయనే ఉన్నారని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కిన్నెర ప్రసాద్ 2020 లో వైసీపీలోకి వచ్చారని అంతకుమునుపు టీడీపీలో వుంటూ పలు లే ఔట్ లు వేశారని..వాటిల్లో కూడా కోట్ల మేర అవినీతి జరిగిందా అని అనిల్ ఎదురు ప్రశ్నలు వేశారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
అనిల్ ఆరోపణల పై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరడంతో పాటు అక్రమ లే ఔట్ ల పై విచారణ చేయాలని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ లే ఔట్ ల కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన అనిల్…దీనిపై ప్రమాణం కూడా చేస్తానని అన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలోనే అక్రమాలు అధికంగా జరిగాయని చెప్పారు. తాను కూడా అనిల్ అవినీతిని నిరూపిస్తానని కోటం రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. నగర పరిధిలో అనిల్ అనుచరులు ప్రభుత్వ శివారు భూములను ఆక్రమించుకుని లే ఔట్లు వేశారని దానిని తాను నిరూపిస్తానని కోటంరెడ్డి చెబుతున్నారు.
నెల్లూరు నగరంలోని మూడో మైలు ప్రాంతంలోని ప్రశాంతి నగర్ లో అనిల్ అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంతో పాటు అక్రమ లే ఔట్ ల ద్వారా విక్రయిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అనిల్ బాగోతం బట్టబయలు అవుతుండటంతోనే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో విచారణకు అంగీకరిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎవరి హయాంలో ఎన్ని అక్రమ లే ఔట్లు వేశారు. ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే విషయంతో పాటు అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!