పోలవరాన్ని ప్రేక్షకుడిగా చూడడానికి సిద్దంగా ఉన్నా : చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు ఇస్తానంటూ ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే నెల రోజుల్లో ఇళ్లకు డాక్యుమెంట్లు ఉచితంగా ఇస్తాం. కిళ్లి కొట్లో ఆన్ లైన్లో చెల్లిస్తే కిళ్లి ఇస్తారు.. కానీ మద్యం దుకాణంలో మాత్రం డబ్బులే చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపులైతే సాయంత్రానికల్లా పంపకాలు కుదరవని మద్యం దుకాణాల్లో ఆన్లైన్ సేవలు పెట్టలేదు అని పేర్కొన్నారు.
మూడు రాజధానుల చట్టం చేశారు.. కోర్టులో ఇబ్బంది వస్తుందని చట్టాన్ని రద్దు చేశారు. మళ్లీ మూడు రాజధానుల చట్టం చేస్తానంటున్నారు.. ఇదేం పరిపాలన. మంత్రి వరి పంట వెయ్యొద్దు అంటారు…మరి ఏమి వెయ్యాలి…గంజాయి పంట వేయిస్తారా అని ప్రశ్నించారు. పోలవరం గురించి ఎగిరెగిరి మాట్లాడారు.. 2021 డిసెంబర్ నాటికి పోలవరం కట్టేస్తానన్నారు. సీఎం, ఇరిగేషన్ మంత్రి ఏం సమాధానం చెబుతారు.. పోలవరాన్ని ప్రారంభించడండి.. ప్రేకక్షుడిగా చూడడానికి సిద్దంగా ఉన్నా అని అన్నారు. వైఎస్ ప్రారంభించిన అభయ హస్తం స్కీంను జగన్ తీసేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మిగులు నిధుల పైనా సీఎం జగన్ కన్నేశారు. నిన్నటి వరకు ఓటేస్తే ఏం చేస్తామో చెప్పాం.. ఓటేయకుంటే ఏం కట్ చేస్తామో జగన్ చెబుతున్నారు. గురజాలలో చనిపోయిన ఎనిమిది మంది కార్యకర్తలకు లక్ష ఆర్థిక సాయం ఇస్తాం. క్వారీలో పడి చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!