Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్.. ఈ వ్యవహారం ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నఫలంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.. హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందన్నారు..
Read Also: Union Budget 2023: పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
అయితే, ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం వైఎస్ జగన్.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసిన ఆయన.. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్లోనే ఉందన్నారు.. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ప్రకటన హైకోర్టు దిక్కరణే అవుతుందన్నారు పయ్యావుల కేశవ్. కాగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!