Union Budget 2023: పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభను రేపటికి (ఫిబ్రవరి 1వ తేదీ)కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు.
“భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు.. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడీబీ, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల బట్టి.. వాస్తవ జీడీపీ.. 6-6.8శాతం మధ్యలో ఉండొచ్చు” అని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ముందు స్థాయికి చేరుకుందని ఈ సర్వే స్పష్టం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని వివరించింది. భారత్కు కొన్ని అంశాల్లో ఉన్న ప్రయోజనాల కారణంగా.. దేశ జీడీపీ 6-6.8శాతం మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7శాతం. 2021-22లో ఇది 8.7 శాతంగా ఉంది.
పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్చేంజ్ రేటు పరంగా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. ఇది ప్రైవేట్ వినియోగాన్ని, పెట్టుబడుల్ని బలహీనపరచలేదు.
Gautam Adani: టాప్-10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్..కారణం ఇదే!
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!