Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.. టీడీపీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదంలో.. టీడీపీ కార్యాలయం ధ్వంసం అయ్యింది.. పలు కార్లను కూడా ధ్వంసం చేశారు.. ఓ కారుకు నిప్పుపెట్టారు.. కార్యాలయంలో ఫర్నీచర్, అద్దాలు పగలగొట్టారు.. ఇక, ఈ దాడికి నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది.. రోడ్డుపై బైఠాయించారు టీడీపీ నేతలు.. దీంతో మళ్లీ మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేత పట్టాభి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.. మరోవైపు.. గన్నవరం ఘటనలో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.. రెండు కేసుల్లో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 143, 147, 149, 307 , 333, 341, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు పెట్టారు.
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
గన్నవరంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు గన్నవరం సీఐ కనకారావు.. ఈ కేసులో ఏ1 గా పట్టాభి, ఏ2గా దొంతి చిన్నాతో పాటు మరో 15 మంది పై కేసులు నమోదు చేశారు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు సీమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇక, రమేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో 143, 147, 149, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసు పెట్టారు.. ఇక, అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను గన్నవరం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు..
Read Also: Pak University Exam: యూనివర్సిటీ పరీక్షలో బూతు ప్రశ్న.. అన్నాచెల్లి మధ్య లింక్!
మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశంపై సీసీ ఫుటేజ్ విడుదల చేసింది టీడీపీ.. పార్టీ కార్యాలయంలోకి దూసుకొచ్చి ఫర్నిచర్.. కంప్యూటర్లను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారని చెబుతున్నారు.. అయితే, అనంతరం వైసీపీ కార్యకర్తలను బయటకు పంపిన పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉన్న ఓ వస్తువును తీసుకెళ్లారని చెబుతున్నారు.. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం.. ఓ వస్తువును తన జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు కానిస్టేబుల్.. ఇంతకీ అది ఏంటి? అనేది తెలియాల్సి ఉండగా.. మేం బాధితులం.. మాపై కేసులు పెట్టడం ఏంటి.. అరెస్ట్లు చేయడం ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
తాజావార్తలు
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!