డీజీపీకి చంద్రబాబు లేఖ.. ఆటవిక రాజ్యం తలపిస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. టీడీపీ సానుభూతిపరులపై పదే పదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ, దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.. వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారన్నారు చంద్రబాబు.
కుప్పం టీడీపీ క్రియాశీల సభ్యుడు మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం 1.55 గంటలకు వైసీపీ నేతలు కుప్పంలో కిడ్నాప్ చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. మురళిని నేరుగా రెస్కో చైర్పర్సన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని.. మురళికి కుడి కన్ను దగ్గర అతని ముఖం మీద గాయాలయ్యాయని.. 20 డిసెంబర్ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంథిల్ కుమార్ ఇంటి నుండి రెండు కార్లు, రెండు బైక్లలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, కొట్టారని పేర్కొన్నారు.. వైసీపీ నేతల బెదిరింపు కారణంగా మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటనను నివేదించలేదన్న ఆయన.. భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మురళికి భద్రత కల్పించడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని.. పోలీసుల సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతుందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!