Taneti Vanitha: 46 ముంపు మండలాల్లో సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు, గోదావరి వరద కారణంగా అటుతెలంగాణ, ఇటు ఏపీలోని పోలవరం, గోదావరి ముంపు ప్రాంతాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46 ముంపు మండలాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు అందిస్తుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టర్ మాధవి లతలతో కలిసి గురువారం సీతానగరం మండలం లోని ముంపు గ్రామాలను పరిశీలించారు.
LIVE: భద్రాద్రికి రాకపోకలు బంద్.. ఆ ఒక్క దారీ మూసివేత
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ముంపు ప్రాంతాల్లోని సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి వనిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిక్షణం పరిశీలిస్తున్నారని, బాధితులకు శిబిరాలను ఏర్పాటు చేసి, అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా శిబిరాల్లో ఉంటున్న వారికి, వరదలు తగ్గిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించే విధంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. పోలవరానికి భారీగా పెరిగిన వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 34.840, స్పిల్ వే దిగువన 26.620 మీటర్లు నమోదైన నీటిమట్టం. 48 గేట్ల ద్వారా 16,16,830 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ,కటుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారికి ఆహారం పంపడానికి హెలికాఫ్టర్ పంపింది విపత్తుల సంస్థ.గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు.
ఇటు భద్రాచలంలోని ప్రాంతాలు ముంపుతో మునిగిపోతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి వరద వస్తుందని చెప్తున్నారు తాము ఇంత పెద్ద స్థాయి వరద వస్తుందని అనుకోలేదని కానీ ఇప్పుడు వస్తున్న వరదతో తమ ఇండ్లన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం పట్టణంలో ముంపు ప్రాంతాల్లో తమ సామాన్ల కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భద్రాచలంకి వెళ్ళే దారులన్నీ మూసేశారు. ప్రధాన రహదారి, బ్రిడ్జిని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నాం. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని పంపించము. రాత్రికి సుమారుగా 70 అడుగుల వరకు వరద ఉధృతి పెరుగుతుంది అని అంచనా వేశాం అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్. ఎట్టి పరిస్థితులలో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దు. బయటికి రావొద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో పర్య వేక్షిస్తున్నాము. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావొద్దన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్.
తాజావార్తలు
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!