Taneti Vanitha: 46 ముంపు మండలాల్లో సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు, గోదావరి వరద కారణంగా అటుతెలంగాణ, ఇటు ఏపీలోని పోలవరం, గోదావరి ముంపు ప్రాంతాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46 ముంపు మండలాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు అందిస్తుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టర్ మాధవి లతలతో కలిసి గురువారం సీతానగరం మండలం లోని ముంపు గ్రామాలను పరిశీలించారు.
LIVE: భద్రాద్రికి రాకపోకలు బంద్.. ఆ ఒక్క దారీ మూసివేత
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
ముంపు ప్రాంతాల్లోని సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి వనిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిక్షణం పరిశీలిస్తున్నారని, బాధితులకు శిబిరాలను ఏర్పాటు చేసి, అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా శిబిరాల్లో ఉంటున్న వారికి, వరదలు తగ్గిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించే విధంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. పోలవరానికి భారీగా పెరిగిన వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 34.840, స్పిల్ వే దిగువన 26.620 మీటర్లు నమోదైన నీటిమట్టం. 48 గేట్ల ద్వారా 16,16,830 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ,కటుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారికి ఆహారం పంపడానికి హెలికాఫ్టర్ పంపింది విపత్తుల సంస్థ.గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు.
ఇటు భద్రాచలంలోని ప్రాంతాలు ముంపుతో మునిగిపోతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి వరద వస్తుందని చెప్తున్నారు తాము ఇంత పెద్ద స్థాయి వరద వస్తుందని అనుకోలేదని కానీ ఇప్పుడు వస్తున్న వరదతో తమ ఇండ్లన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం పట్టణంలో ముంపు ప్రాంతాల్లో తమ సామాన్ల కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భద్రాచలంకి వెళ్ళే దారులన్నీ మూసేశారు. ప్రధాన రహదారి, బ్రిడ్జిని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నాం. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని పంపించము. రాత్రికి సుమారుగా 70 అడుగుల వరకు వరద ఉధృతి పెరుగుతుంది అని అంచనా వేశాం అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్. ఎట్టి పరిస్థితులలో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దు. బయటికి రావొద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో పర్య వేక్షిస్తున్నాము. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావొద్దన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!