ఇంటర్మీడియట్ పరీక్షలపై తన ఆదేశాలను మరోసారి పునరుద్ఘాటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఐసీఎస్ఈ మరియు సీబీఎస్ఈ విధానం ప్రకారం… జులై 31వ తేదీ లోగా రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.. ఈ విషయంలో ఏ ఇతర అంశాలను.. వాజ్యం కానీ.. దరఖాస్తులను కానీ విచారించేదిలేదని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేసింది.. అయితే, 10 రోజులలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనానికి నివేదించారు ఏపీ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దుష్యంతుడి దవే.. ఈ కమిటీ విద్యార్థుల ప్రతిభను పరీక్షించి, మార్కులు కేటాయించే విధానాన్ని రూపొందించి, ధర్నాసనం ఆదేశాల ప్రకారం జులై 31వ తేదీలోగా ఫలితాలను వెల్లడిస్తామని ధర్మసనానికి తెలియజేశారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే.. ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.