Srisailam: స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న పీఠాధిపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం,కాశీపీఠాధిపతులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కాశీ జ్ఞానసింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య,శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామాశివాచార్య దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయచైన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాదర స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి అభిషేకం జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతుల వెంట వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతులు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయాలను అనుసరించి పీఠాధిపతులకు శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు సమర్పించారు. మరోవైపు సెలవులు కావడంతో శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైల క్షేత్రంలోని టోల్ గేట్ సమీపంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రంలో నూతనంగా నిర్మించిన 14 రూములు కలిగిన బి-బ్లాక్ భవనం ప్రారంభమయింది.
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
దేవస్థానం సూచించిన నియమ నిబంధనలకు లోబడి సత్రంలో పని చేయాలని, క్షేత్రానికి వచ్చే భక్తులకు కులమతాలకతీతంగా గదులు ఇవ్వాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అన్నారు. సత్రం ప్రాంగణంలో, గదులలో పరిశుభ్రతను పాటించాలని సత్రం యాజమాన్యానికి ఈవో లవన్న సూచించారు.
Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి
- Tags
- ap
- Bhakthi
- devotees
- kasi peetham
- nandyal
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?