Srikakulam: ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ మృతి.. అదే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam: శ్రీకాకుళం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఉరిటి స్వప్నప్రియ అనే మహిళ మృతి చెందింది. ఎస్బిఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న స్వప్నప్రియ ఆత్మ హత్యకు యత్నించి చికిత్స పొందుతూ మరణించింది. వివరాలలోకి వెళ్తే.. స్వప్నప్రియ పని చేస్తున్న బ్యాంకులో బంగారం తనకా పెట్టారు ఖాతాదారులు. కాగా తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ఖాతాదారులు గత పది రోజులుగా బ్యాంకును సంప్రదిస్తున్నారు. అయితే డబ్బులు తీసుకుని తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వాల్సిన సిబ్బంది.. ఆలా చెయ్యకుండా ఆడిట్ పేరుతో వాయిదా వేస్తూ వస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తాకట్టు పెట్టిన బంగారం మిస్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బంగారాన్ని స్వప్న ప్రియే మిస్ చేసిందంటూ ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read also:Indian Navy : సముద్రంలో పెరుగుతున్న భారత్ బలం.. నావికాదళానికి యాంటీ మిస్సైల్ వ్యవస్థ
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
అయితే ఈ ప్రచారం పైన స్పందించిన SBI R.M. రాజు.. ఖాతాదారుల ఆందోళనలతో బంగారం మిస్ అయ్యిందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ సోమవారం ప్రకటించారు. అలానే ఈ విషయం పైన అధికారులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8నాటికి బ్యాంక్ ఆడిట్ పూర్తి చేసి ఖాతాదారుల బంగారాన్ని ఇచ్చేస్తామని వెల్లడించారు. కాగా స్వప్నప్రియ నిన్న రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను విశాఖ లోని కార్పొరేట్ హాస్పిటల్లో చెరిపించారు. ఈ క్రమంలో స్వప్నప్రియ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందింది. SBI అధికారులు ఖాతాదారులకు బంగారం ఆడిట్ అయిపోగానే ఇస్తామని ప్రకటించిన రెండు రోజులకే స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో బాధితల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలానే స్వప్న ప్రియ మృతితో బంగారం మిస్ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని బాధిత ఖాతాదారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!