Minister Atchannaidu: ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్య.. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు..
- ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తాం..
- అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తాం..
- గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రజాధనం ఖర్చు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. విద్యా ప్రమాణాల మెరుగుకు శ్రీకారం చుడతామన్నారు. తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు మెరుగు పరచాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడిగా సాగేవని, ఐదేళ్ల కాలంలో విద్యావ్యవస్ధలను బ్రష్టు పట్టించారని వివమర్శించారు..
Read Also: Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
టెక్కలి నియోజక వర్గం కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం) కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా శాఖలో ఒక్కొక్కటిగా సంస్కరణలు తీసుకువస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేవిధంగా అవరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఉపాధ్యాయులు బోధిస్తే మంచి ఫలితాలు రావని భావించిన కూటమి ప్రభుత్వం తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)కు శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాల నిర్వ హిస్తున్నామని మంత్రి తెలిపారు.
Read Also: Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తూ మరో పక్క సంక్షేమ పథకాలు, విద్య ఉపాధి, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కళాశాలల, పాఠశాలల్లో పారిశుభ్రత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాలు నిర్వహించడం ద్వారా క్రమశిక్షణ, విద్యాప్రగతి, ఇతర అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లితండ్రులకు ఇటు వంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా పాఠశాలకు వచ్చే విద్యార్థలు వారి విద్యాబోధన అంశాలపై స్వయంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు..
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!