Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం.. అసలు విషయం బయటపెట్టిన మాధురి..!
- రచ్చగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం..
- దువ్వాడ శ్రీనివాస్కు దివ్వల మాధురికి ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపణలు..
- నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చిన మాధురి..
- క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divvala Madhuri: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అది వారి కుటుంబ వ్యవహారం.. వారితోనే తేల్చుకోవాలి.. కానీ, తనను మధ్యలోకి లాగొద్దు అన్నారు.. ఇక, దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాధురి.. అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇవ్వాలని వైఎస్ జగన్ను కలిశారని చెప్పుకొచ్చారు..
Read Also: Mohammed Siraj: క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు..
Also Read
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
అయితే, తాను దువ్వాడ శ్రీనివాస్కు ఎందుకు దగ్గరయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టారు దివ్వల మాధురి.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు.. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీ పరుడని ప్రశంసించారు.. మరోవైపు.. తాను దువ్వాడను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. అతని ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారని.. అలాంటప్పుడు ఇంకా నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తామని ప్రశ్నించారు దివ్వల మాధురి..
Read Also: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..
మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానని తెలిపారు. ఆ విషయం పార్టీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు దివ్వల మాధురి.. ఈ సమయంలో ప్రతీ ఇంటికి వెళ్తూ.. శ్రీనివాస్-మాధురికి ఎఫైర్ ఉందంటూ.. వాణి చెప్పడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.. ఇక, మీకు ఓట్ బ్యాంక్ ఉంది పార్టిలోకి రావాలని వారే ఆహ్వానించారు. మా ఫ్యామిలి పెద్ద కుటుంబం. రాజకీయాలకు నేను చాలా దూరం. కానీ, జగనన్న అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ . దీంతో.. నన్ను బతిమాలి పార్టీలో జాయిన్ చేశారన్నారు.. అయితే, భార్య భర్తల మధ్య గొడవ ఉండకూడదని నేను దూరంగా ఉన్నాను.. కానీ, నా నన్ను, నా ఫ్యామిలీని వీధిలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్న ఆమె.. తమది మాత్రం ఇల్లీగల్ ఎఫైర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించిన ఆమె.. మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు.. తనపై లేనిపోని ఆరోపణలు చేశారు కాబట్టే.. నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటున్న దివ్వల మాధురి.. ఇంకా ఏం మాట్లాడిందో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?