Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Krishnadasu: శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను వివరించారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంటల సాగు ఆలస్యమైందని, ఇప్పటికే సాగు చేసిన పంటలకు కూడా అవసరమైన ఎరువులు సక్రమంగా అందడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు అర బస్తా చొప్పున మాత్రమే ఎరువులు అందుతున్న పరిస్థితి ఉందని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను అందించేవాళ్లమని చెప్పారు. పంటల ఇన్సూరెన్స్ను కూడా ప్రభుత్వమే చెల్లించేదని, దీంతో రైతులు ధైర్యంగా, సౌకర్యంగా వ్యవసాయం చేసేవారని తెలిపారు.
ప్రస్తుతం రైతులకు గతంలో అందిన గౌరవం, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే భావన కనిపించడం లేదని ధర్మాన కృష్ణదాసు విమర్శించారు. దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిని రైతులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ధర్మాన కృష్ణదాసు తెలిపారు. చివరకు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఎరువులు కొనుగోలు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక్కో 50 కేజీల ఎరువుల బస్తాపై సుమారు రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
పెద్ద నాయకులే ఎరువులను దాచిపెడుతున్నారనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల సమస్యలపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, సాగునీరు అందించడంతో పాటు పంటల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు మాజీ సీఎం వైఎస్ జగన్ను గుర్తు చేసుకుంటున్నారని ధర్మాన కృష్ణదాసు వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!