Dharmana Prasada Rao: కూటమి పాలన అంటూ ఏమీ లేదు.. ఆది కేవలం టీడీపీ పాలనే..!
- కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్లు..
- కూటమి పాలన అంటూ ఏమీ లేదు..
- ఆది కేవలం టీడీపీ పాలనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కూటమి పాలన అంటూ ఏమీ లేదు… ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు.. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు.. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా పని చెయ్యాల్సిందే.. కానీ, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదన్నారు.. ఒక రాజధాని కోసం లక్ష కోట్లు అప్పు చేసి ఖర్చు పెడితే అది రాజ్యాంగ బద్ద పాలన ఎలా అవుతుంది? ఆ అప్పు తీర్చడానికి మిగతా ప్రాంతాల వారు కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందన్నారు.. అయితే, సంపదని అన్ని వర్గాలకు సమానంగా పంచితేనే రాజ్యాంగ బద్ద పాలన అవుతుందన్నారు ధర్మాన.
Read Also: Karimnagar: మున్సిపల్ అధికారులకు షాక్.. ఇంటి పన్ను వెనక్కి ఇవ్వండంటూ
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
రాజధాని ఒక చెరువులా తయారైతే దాన్ని చూపించకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు ధర్మాన.. గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా రైతులు కొట్టుకోవడం చూసామా? అని ప్రశ్నించారు.. చదువు ఒక్కటే పేద కుటుంబాన్ని నిలబెట్టగలదు అని నమ్మిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అందుకే, పేద విద్యార్థులు చదువుకునేందుకు విలువగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.. అది ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. దానిపై మనం పోరాడాలి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Canada: ఖలిస్తానీల బరితెగింపు.. భారత కాన్సులేట్ ముట్టడిస్తామని హెచ్చరిక..
మరో వైపు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైసీపీ అంటే పేదవారి అభివృద్ధి కోసం పని చేసే పార్టీ అన్నారు.. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించే వరకు ఎస్సీ సామాజికవర్గం పని చేస్తుందని ప్రకటించారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేయాలని పిలుపునిచ్చారు.. అయితే, దళిత కులంలో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? అని అన్న చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏ దళితుడైనా అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు సుధాకర్బాబు..
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!