Srikakulam: తమ్మినేని సీతారాంతో బొత్స సత్యనారాయణ భేటీ..
- తమ్మినేని సీతారాంతో బొత్స సత్యనారాయణ భేటీ
- అరగంట పాటు వీరిద్దరూ చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లాలోని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెళ్లారు. అరగంట పాటు వీరిద్దరూ చర్చించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ సీతారాం కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. సీతారాం తనయుడు నానికి సర్జరీ జరిగిందని.. చూడటానికి వచ్చానని అన్నారు. మరోవైపు.. అతను దేనిని విమర్శించనని తెలిపారు. మంత్రి కొండపల్లి విషయం తనకు సంబంధం లేదని చెప్పారు. ఎవరు క్రియేట్ చేసారో వారే సమాధానం చెప్పాలని అన్నారు. ఆయనపై ఏం కోపం ఉందో ఆయనపై అలా ప్రచారం చేస్తున్నారు.. తనకు సంబంధ లేని విషయాలు తాను మాట్లాడనని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Sandhya Theatre Stampede: ఆరోజు ధియేటర్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు!
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. పార్టీ మారుతారన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. పీకపోయినా ఎవరైనా పవన్ కల్యాణ్ వైపు వెళ్తారా..? అని అన్నారు. గాలి ప్రచారాలు నమ్మొద్దు.. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణం ప్రజలకు తెలుసని చెప్పారు. తన కుమారుడికి సర్జరీ కోసం బయటకు వెళ్లానని పేర్కొన్నారు. తాను వైసీపీ పార్టీతోనే ఉంటానని తమ్మినేని సీతారాం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా నియమించారు. ఇదే సమయంలో తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్చార్జిని నియమించారు. ఆముదాలవలస వైసీపీ ఇంఛార్జిగా చింతాడ రవికుమార్ను వైఎస్ జగన్ నియమించారు. ఈ క్రమంలో జగన్ నిర్ణయంతో తమ్మినేని సీతారాం అసంతృప్తికి గురయ్యారని.. జనసేనలో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. తమ్మినేని సీతారాం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Akhilesh Yadav: సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో లింగం ఉంది.. తవ్వకాలు జరపాలి..
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!