Atchannaidu: మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు
- మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చింది- మంత్రి
- గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు- అచ్చెన్నాయుడు
- తప్పు చేసిన వారిని లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం- మంత్రి
- చంద్రబాబు.. పవన్ కుటుంబం పై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు- మంత్రి
- మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే అది చివరి రోజు- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు.. ఆస్తుల ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని వైసీపీపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కూడా ప్రజలనుండి అదే ఒత్తిడి ఉంది.. తమ నేత చంద్రబాబు కక్ష్య సాధింపుకి దూరం అని అన్నారు. ఐదు నెలలు ప్రజా స్వామ్యంగా పరిపాలన చేస్తున్నాం.. తప్పు చేసిన వారిని లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ కుటుంబంపై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు.. పవన్ తన ఆడపిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. క్యాబినెట్ భేటీలో బాధపడ్డారని అచ్చెన్న వెల్లడించారు
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
దొంగే దొంగ అన్నట్లుగా జగన్ గొంతు చించుకుని అరుస్తున్నారు.. జగన్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని దుయ్యబట్టారు. పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా వదల్లేదని మంత్రి ఆరోపించారు. ఈ రోజు భావ ప్రకటనా స్వేచ్ఛా గుర్తోచ్చిందా.. జగన్ అని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో.. ఆడపిల్లలపై ఇష్టానుసారం పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన సొంత తల్లి, చెల్లి మీద సోషల్ మీడియాలో పెడుతున్నావంటూ ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హెచ్చరిస్తున్నా.. మహిళలపై ఏ పార్టీ వారైనా అసహ్య పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
AP High Court: హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
కూటమి అంతా హ్యాపీగా ఉంది.. కలిసే ఉంటున్నాం.. లోపాలు ఉంటే చర్చించుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2027లో అధికారంలోకి వస్తా అంటూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మరోవైపు.. తాము 21 మందే గెలిచాం.. అధికారం ముఖ్యం కాదని అసెంబ్లీకి వెళ్లాం.. సమస్యలపై పోరాడాం.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లవా అంటూ ప్రశ్నించారు.
ఎవరడిగితే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా.. దానికి పద్దతి ఉంది కదా అని అన్నారు. నీవు అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రం, ప్రజల కోసం అసలు పట్టింపు లేదని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!