Paritala Sunitha: జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.. హెలికాప్టర్ దిగకుండానే..!
- వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు..
- జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి..
- ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paritala Sunitha: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్ చేశారు.. తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన తప్పుడు మాటలు నమ్మి రాప్తాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దు.. అని సూచించారు.. ఇద్దరి మధ్య జరిగిన గొడవను తోపుదుర్తి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారు.. లింగమయ్య మరణంపై మొదటిగా బాధపడిన వ్యక్తిని నేనే.. దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు.. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్ మోహన్ రెడ్డి.. లింగమయ్య కుటుంబానికి ఏదైనా సాయం అందించు.. అంతేగాని తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాట విని బీసీ కులాల్లో చిచ్చు పెట్టకు.. ఇప్పటికైనా చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేయడానికి నేను ముందుంటాను అని స్పష్టం చేశారు.
Read Also: UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ఇక, జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందన్నారు.. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారు.. కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారు. వాహనాలు తనిఖీ చేసి.. మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారు అని పాత ఘటనను గుర్తుచేశారు.. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు.. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలి.. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడు.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. రాప్తాడు ఇంఛార్జ్ని బీసీకి ఇవ్వాలని సలహాఇచ్చారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు.. ఎవరూ సహనం కోల్పోవద్దు అని సూచించారు రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత..
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!