UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
- ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..
- ఏడు రోజులు నిర్బంధించి 20 మందికి పైగా రేప్..
- కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 29న వారణాసిలోని పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కు తన స్నేహితుడితో అమ్మాయి వెళ్లింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆమె రన్నింగ్ ప్రాక్టీస్ కోసం క్రమం తప్పకుండా యూపీ కాలేజీకి వెళ్తోంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, ‘‘మార్చి 29న ఒక స్నేహితుడితో కలిసి పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కి వెళ్లింది. అక్కడ ఇంకొంత మంది కూడా చేరారు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి, ఆపై సిగ్రా ప్రాంతంలోని వేర్వేరు హోటర్లకు తీసుకెళ్లి, ఆమెపై అక్కడ సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించింది’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Read Also: Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..
నిందితుల్లో కొందరు ఆమెకు తెలిసిన వారు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి వీరు పరిచయం, కొందరు మాజీ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. బాలిక కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమెను గుర్తించి, హుక్కా బార్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.
డీసీపీ వరణ జోన్ చంద్ర కాంత్ మీనా ప్రకారం.. ఆ అమ్మాయి మొదట తన ఇష్టపూర్వకంగానే స్నేహితుడితో వెళ్లిందని, ఏప్రిల్ 4న ఆమె కుటుంబ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారని, అదే రోజు ఆమెను కనుగొన్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఆమె లేదా ఆమె కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మార్చి 29- ఏప్రిల్ 04 మధ్య సామూహికి అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తున్న కేసుపై ఏప్రిల్ 6న లాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో సదరు బాధితురాలు మైనర్ కాదని డీసీపీ మీనా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!