UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
- ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..
- ఏడు రోజులు నిర్బంధించి 20 మందికి పైగా రేప్..
- కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అఘాయిత్యం..
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 29న వారణాసిలోని పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కు తన స్నేహితుడితో అమ్మాయి వెళ్లింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆమె రన్నింగ్ ప్రాక్టీస్ కోసం క్రమం తప్పకుండా యూపీ కాలేజీకి వెళ్తోంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, ‘‘మార్చి 29న ఒక స్నేహితుడితో కలిసి పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కి వెళ్లింది. అక్కడ ఇంకొంత మంది కూడా చేరారు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి, ఆపై సిగ్రా ప్రాంతంలోని వేర్వేరు హోటర్లకు తీసుకెళ్లి, ఆమెపై అక్కడ సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించింది’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
Also Read
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
Read Also: Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..
నిందితుల్లో కొందరు ఆమెకు తెలిసిన వారు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి వీరు పరిచయం, కొందరు మాజీ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. బాలిక కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమెను గుర్తించి, హుక్కా బార్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.
డీసీపీ వరణ జోన్ చంద్ర కాంత్ మీనా ప్రకారం.. ఆ అమ్మాయి మొదట తన ఇష్టపూర్వకంగానే స్నేహితుడితో వెళ్లిందని, ఏప్రిల్ 4న ఆమె కుటుంబ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారని, అదే రోజు ఆమెను కనుగొన్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఆమె లేదా ఆమె కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మార్చి 29- ఏప్రిల్ 04 మధ్య సామూహికి అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తున్న కేసుపై ఏప్రిల్ 6న లాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో సదరు బాధితురాలు మైనర్ కాదని డీసీపీ మీనా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
-
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
-
Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!