UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
- ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..
- ఏడు రోజులు నిర్బంధించి 20 మందికి పైగా రేప్..
- కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 29న వారణాసిలోని పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కు తన స్నేహితుడితో అమ్మాయి వెళ్లింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆమె రన్నింగ్ ప్రాక్టీస్ కోసం క్రమం తప్పకుండా యూపీ కాలేజీకి వెళ్తోంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, ‘‘మార్చి 29న ఒక స్నేహితుడితో కలిసి పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్కి వెళ్లింది. అక్కడ ఇంకొంత మంది కూడా చేరారు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి, ఆపై సిగ్రా ప్రాంతంలోని వేర్వేరు హోటర్లకు తీసుకెళ్లి, ఆమెపై అక్కడ సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించింది’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
Read Also: Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..
నిందితుల్లో కొందరు ఆమెకు తెలిసిన వారు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి వీరు పరిచయం, కొందరు మాజీ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. బాలిక కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమెను గుర్తించి, హుక్కా బార్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.
డీసీపీ వరణ జోన్ చంద్ర కాంత్ మీనా ప్రకారం.. ఆ అమ్మాయి మొదట తన ఇష్టపూర్వకంగానే స్నేహితుడితో వెళ్లిందని, ఏప్రిల్ 4న ఆమె కుటుంబ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారని, అదే రోజు ఆమెను కనుగొన్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఆమె లేదా ఆమె కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మార్చి 29- ఏప్రిల్ 04 మధ్య సామూహికి అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తున్న కేసుపై ఏప్రిల్ 6న లాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో సదరు బాధితురాలు మైనర్ కాదని డీసీపీ మీనా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?