Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ex Minister Anil Kumar Yadav React On Illegal Mining

Anil Kumar Yadav: ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్.. 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే

NTV Telugu Twitter
Published Date :May 4, 2025 , 12:55 pm
By Chandra Shekhar
  • కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్..
  • ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ కొనసాగుతుందని ఆరోపణలు..
  • అక్రమ మైనింగ్ బాధితుల్లో 70 శాతం మంది టీడీపీ వాళ్లే: అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav: ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్.. 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.. 7 నెలల తర్వాత లక్ష 25 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో రాశారు.. వీటిని తీసుకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.. ఈ తెల్లరాయిని తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు ఎమ్మార్వో చెబుతున్నారు.. గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి.. కానీ, ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ ఆరోపించారు.

Read Also: Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !

ఇక, ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయిని తీసుకు వెళుతున్నారు.. కూటమి సర్కార్ ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామన్నారు.. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది.. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు.. వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.. గనుల వద్ద గూండాలను పెట్టారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేమిరెడ్డి తన అనుచరులను మాట్లాడించకుండా తానే సమాధానం చెప్పాలి.. ఎవరు తెల్ల రాయి తీసినా తనకే అమ్మాలని వేమిరెడ్డి భయపెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.

Read Also: Bandi Sanjay: ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే.. లొంగిపోవాల్సిందే

కాగా, అక్రమ మైనింగ్ ను స్వయంగా వెళ్లి పరిశీలిస్తాను అని వైసీపీ నేత అనిల్ కుమార్ తెలిపారు. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను.. తన కంపెనీ కాకపోతే ఆయన ఎందుకు ఆన్సర్ ఇవ్వడం లేదు.. రూ.15 వందల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు.. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయని.. క్వార్ట్జ్ డంప్ ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా.. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి.. బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు.. చేస్తే అందరికీ చేయాలి.. లేకుంటే ఆందోళన చేస్తానన్నారు. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Anil Kumar Yadav
  • illegal mining
  • Nellore
  • tdp

తాజావార్తలు

  • Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏం రాసిందంటే..!

  • Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్‌ మంజూరు

  • Jodha-Akbar: జోధా-అక్బర్ పెళ్లి నిజం కాదు, బ్రిటీష్ ప్రభావిత భారత చరిత్ర: రాజస్థాన్ గవర్నర్

  • Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్

  • CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions