Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?
- రోజు రోజుకు వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోతున్నాయి..
- రేపు రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు..
- చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి: కాకానీ గోవర్థన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతల దాడులు తీవ్రమవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రషీద్ ను దారుణంగా హతమార్చారు.. అంతరంగిక వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు.. ఇది పద్దతి కాదు.. కొందరు టీడీపీ నేతలు మాత్రం ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని ప్రచారం చేశారు.. హంతకుడు జిలానీ టిడిపికి చెందిన వారు అని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసు.. హత్యకు సూత్రధారులను గుర్తించాలి అని మాజీ మంత్రి కాకానీ డిమాండ్ చేశారు.
Read Also: Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, రేపు రషీద్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు అని కాకానీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. మాజీ లోక్ సభ సభ్యుడు రెడ్డెప్ప ఇంటికి
ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.. పోలీసులు వీడియో గ్రాఫర్ల పాత్ర పోషించారే తప్ప రక్షణ ఇవ్వలేదు అని మండిపడ్డారు. చివరకు మిథున్ రెడ్డి గన్ మెన్లు గాలిలోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పాడింది.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి.. మూడు వేల కుటుంబాలు గ్రామాలు వదిలి వలస వెళ్లారు అని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Read Also: Jagapathi Babu: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను.. జగ్గు భాయ్ పోస్ట్ వైరల్..
ఇక, మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని మాజీ మంత్రి కాకానీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. ముచ్చుమర్రిలో బాలిక శవం కూడా దొరకడం లేదు.. మూడు రోజుల్లో హోంమంత్రి మాటలు చూసి ఎంతో మురిసిపోయాము.. ఇప్పుడు ఆమె ఎక్కడుందో కనపడటం లేదు.. వైసీపీ నేతల మీద దాడులు పెరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.. ఇలాంటి సంప్రదాయాలు తీసుకురావడం సరికాదు.. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి.. ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా చేస్తామన్న పవన్.. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటం లేదు అని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించరు.. ఎవరు ఇవ్వలేని పాలనను ఇస్తామని టీడీపీ- జనసేన- బీజేపీ నేతలు అంటే ఏమో అనుకున్నాము.. ఇదే వాళ్ళు చేస్తున్న పాలన అని కాకానీ గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!