వైసీపీ సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాల !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు.
విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు బలమైన రాజకీయ ప్రత్యర్ధులు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవం వీర భద్రరావుకి ఉంది. ఎప్పుడూ రాజకీయంగా ప్రత్యర్ధితోనే పోరాటం చేసిన దాడికి తొలిసారి వింతైన అనుభవం సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. అధికార పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్కు మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే.
Also Read
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఐతే…ఇటీవల ఆ దూరం బాగా పెరిగిపోవడమే కాదు…ఒకరి వర్గంను మరొకరు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రిని ఆహ్వానించకుండా పక్కన పెట్టేసిందట ఎమ్మెల్యే గ్రూప్. తమతో కలిసి రావడం లేదని హైకమాండ్కు చెప్పేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని దాడి వర్గం భావిస్తోంది. ఇటీవల నెహ్రు చౌక్లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు పిలవని పేరంటమే అయినా దాడి వెళ్లివచ్చారు. దీనికి కారణం ఉందట. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లకపోతే టీడీపీకి తాను అనుకూలం అనే ప్రచారం చేస్తారనే అనుమానంతోనే వెళ్లారట. జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ఎమ్మెల్యే వర్గం, దాడి గ్రూప్ వేరు వేరుగానే ర్యాలీలు నిర్వహించాయి.
ఐతే..ఇలా చూస్తూ వదిలేస్తే ఎమ్మెల్యే వర్గం రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే అనుమానం దాడిలో కనిపిస్తుందట. అందుకే ఎమ్మెల్యే వర్గం పిలిచినా..పిలవకపోయినా..కార్యక్రమాలకు వెళ్లటంతో పాటు..తనకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ లేదనే విషయాన్ని బహిర్గతం చేయటం ద్వారా..ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది దాడి ప్లాన్ అట.
ఇక…అదే వేదికపై నుంచి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు సీఎం ఒక్కరే బాస్ అని జగన్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని కుండ బద్దలు కొట్టేశారు. తద్వారా ఎమ్మెల్యే అమర్నాథ్ను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదనే సంకేతాలు పంపించారు వీరభద్రరావు. ఈ పరిణామాల వెనుక పవర్ పాలిటిక్స్ కారణం అనేది అనకాపల్లి గురించి తెలిసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది.
తాజావార్తలు
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..